ఆన్ లైన్ లో విటులను ఆకర్షించి.. లాడ్జిలో వ్యభిచారం..!

By telugu news teamFirst Published Jun 2, 2021, 8:43 AM IST
Highlights

ఆన్‌లైన్‌ ద్వారా విటులను ఆకర్షించి, వారిని ఎవరికీ తెలియకుండా లాడ్జికి తీసుకెళ్ళి డబ్బులు సంపాదించే ఓ వ్యభిచార ముఠాకు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. 
 

ఆన్ లైన్ లో యువతను ఆకర్షిస్తూ.. లాడ్జిలో ఎవరికీ తెలియకుండా.. వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ సంఘటన చెన్నైలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చెన్నైలోని స్థానిక సాలిగ్రామం పోస్టల్ ఆడిట్ కాలనీలో ఓ లాడ్జిలో గత కొంతకాలంగా గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా విటులను ఆకర్షించి, వారిని ఎవరికీ తెలియకుండా లాడ్జికి తీసుకెళ్ళి డబ్బులు సంపాదించే ఓ వ్యభిచార ముఠాకు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. 

అలాగే, ఈ లాడ్జీలో ఉన్న యువతిని అదుపులోకి తీసుకుని ప్రభు త్వం సంరక్షణా కేంద్రానికి తరలించారు.  సాలిగ్రామంలోని ఒక లాడ్జీలో వ్యభిచా రం జరుగుతున్నట్టు స్పెషల్‌ పోలీస్‌ టీం ఎస్‌ఐ బాలకృష్ణన్‌కు సమాచారం వచ్చిం ది. ఆ వెంటనే తన బృందంతో కలిసి అక్కడకు వెళ్ళిన పోలీసులు 24 యేళ్ళ  యు వతితో వ్యభిచారం సాగొస్తున్న తిరునెల్వేలి జిల్లాకు చెందిన వెట్రివేల్‌ (49) అనే వ్యక్తిని అరెస్టు చేశారు.

 అతని నుంచి రూ.9200 నగదుతో పాటు రెండు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద జరిపిన విచారణలో  రాజేష్‌ అనే వ్యక్తి నగరంలోని పదికి పైగా లాడ్జీల్లో అందమైన అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్నట్టు తెలిసింది. పరారీలో ఉన్న రాజేష్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.  

click me!