భర్త కోల్పోయిన మహిళను వ్యభిచారం చేయాలంటూ..

By telugu news teamFirst Published Sep 4, 2021, 12:22 PM IST
Highlights

ఆమెకు అండగా నిలవాల్సిన బంధువు.. ఆమెను మరింతగా బాధపెట్టారు. వ్యభిచారం చేయాలంటూ ఆమెను మరింత ఒత్తిడి చేశారు

ఆమెకు భర్త చనిపోయాడు. అసలే పేద కుటుంబం. భర్త అండ కూడా లేకపోవడంతో.. ఆర్థికంగా ఆమె మరింత చితికిపోయింది. అలాంటి ఆమెకు అండగా నిలవాల్సిన బంధువు.. ఆమెను మరింతగా బాధపెట్టారు. వ్యభిచారం చేయాలంటూ ఆమెను మరింత ఒత్తిడి చేశారు. ఆమె ఒప్పుకోకపోతే ఆమెపై దాడికి దిగారు.. దీంతో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. రాజస్థాన్‌లోని భరత్‌పూర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 

భరత్‌పూర్‌కు చెందిన అనిత అనే మహిళ భర్త ఐదు నెలల క్రితం కరోనాతో చనిపోయాడు. దీంతో అనిత ఒంటరిగా మిగిలిపోయింది. పేద కుటుంబం కావడంతో ఆమె ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంది. అలాంటి సమయంలో బంధువులు ఖాజా సింగ్, ప్రియ దంపతులు ఆమె ఇంటికి వచ్చారు. తాము చెప్పినట్టు చేస్తే డబ్బుకు లోటు ఉండదని ప్రలోభ పెట్టారు. వ్యభిచారం చేయమని బలవంతం చేశారు. 

అందుకు అనిత ఒప్పుకోలేదు. కష్టపడి సంపాదించుకోవడం వైపే ఆమె మొగ్గు చూపింది. దీంతో ఆగ్రహానికి గురైన ఖాజా సింగ్ దంపతులు గత బుధవారం అనితపై దాడికి తెగబడ్డారు. ఆమెను విచక్షణారహితంగా కొట్టి ఆమె బట్టలు చింపేశారు. దీంతో అనిత పోలీసులను ఆశ్రయించింది. తనను బలవంతంగా వ్యభిచారంలోకి దించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఖాజా, ప్రియలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఖాజా, ప్రియలను అదుపులోకి తీసుకున్నారు. 

click me!