India Pakistan Tensions: మరోసారి తన వక్రబుద్ధిని చూపించిన పాకిస్తాన్

Published : Aug 11, 2025, 07:24 PM IST
Pakistan Restricts Essential Supplies to Indian Diplomats

సారాంశం

India Pakistan Tensions: ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్ళీ పెరిగాయి. ఇస్లామాబాద్, ఇండియన్ హైకమిషన్ సిబ్బందికి నీళ్ళు, గ్యాస్, పేపర్లు ఆపేసింది. కావాలనే పాక్ మరోసారి భారత్ ను రెచ్చగొడుతోంది.

DID YOU KNOW ?
1961 వియన్నా ఒప్పందం
ఇది ప్రపంచ దేశాల మధ్య సంబంధాలకు సంబంధించింది. 1961 వియన్నా ఒప్పందం ప్రకారం రాయబారులకు భద్రత, మౌలిక సదుపాయాల హక్కు కల్పించాలి.

India Pakistan Tensions: భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలు మళ్లీ ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇస్లామాబాద్‌లోని భారత రాయబారి సిబ్బందికి పాకిస్థాన్ ప్రభుత్వం నీరు, గ్యాస్, పత్రికల సరఫరా నిలిపివేసింది . ఇది ఆపరేషన్ సింధూర్ తర్వాత మరోసారి భారత్ ను పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. అలాగే, దీనిని భారత్ ఇండస్ వాటర్ ఒప్పందాన్ని కఠినంగా అమలు చేయడం నేపథ్యంలో కావాలనే పాక్ ఇలా చేస్తోందని భావిస్తున్నారు. భారత ఉన్నతాధికారులు ఈ చర్యను ఉద్దేశపూర్వకంగా, ప్రణాళికాబద్ధంగా, వియన్నా ఒప్పందానికి విరుద్ధంగా” ఉన్నదిగా పేర్కొంటున్నారు.

ఐఎస్ఐ ప్రణాళికతో ప్రతీకార చర్యలు

CNN-News18కు అందిన సమాచారం ప్రకారం.. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ ఆధ్వర్యంలో భారత రాయబారి సిబ్బందిపై జీవన, పని పరిస్థితులను దెబ్బతీయడానికి ఈ చర్యలు చేపట్టారు. సుయి నార్తర్న్ గ్యాస్ పైప్‌లైన్స్ లిమిటెడ్ (SNGPL) పైప్‌లైన్ వేసినా, గ్యాస్ సరఫరా కావడం లేదు. గ్యాస్ సిలిండర్ విక్రేతలను కూడా భారత సిబ్బందికి అమ్మవద్దని హెచ్చరించారు. దీంతో వారు మార్కెట్‌లో అధిక ధరలకు ప్రత్యామ్నాయాలను వెతకాల్సి వస్తోంది.

తాగునీరు, పత్రికలపై కూడా ఆంక్షలు

భారత రాయబారి కార్యాలయానికి కాంట్రాక్ట్ ఉన్న తాగునీటి సరఫరాదారుని డెలివరీలు ఆపివేయమని ఆదేశించారు. ఇస్లామాబాద్ అంతటా వ్యాపారులకు భారత రాయబారి సిబ్బందికి తాగునీరు అమ్మవద్దని సూచించారు. దీని వల్ల వారు సురక్షితం కాని టాప్ వాటర్ లేదా ఖరీదైన ఫిల్టరేషన్ సిస్టమ్‌లపై ఆధారపడాల్సి వస్తోంది. అదనంగా, పత్రికల సరఫరాదారులకు కూడా పత్రికలు ఇవ్వొద్దని ఆదేశించారు. దీన్ని భారత అధికారులు, స్థానిక వార్తలు, అభిప్రాయాలపై రాయబారి సిబ్బంది ప్రాప్యతను తగ్గించే ప్రయత్నంగా భావిస్తున్నారు.

 

 

కాగా, 2019 పుల్వామా దాడి, అనంతరం బాలాకోట్ వైమానిక దాడుల తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరగలేదు. ఇటీవల ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులకు పెద్ద దెబ్బ తగలడం, ఇండస్ వాటర్ ఒప్పందాన్ని భారత్ కఠినంగా అమలు చేయడం, ఈ ఉద్రిక్తతలను మరింత పెంచాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu