
Union Home Minister Amit Shah: తమ ప్రభుత్వం దేశంలో మెరుగైన పాలన అందిస్తున్నదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఉగ్రవాదం, తిరుగుబాటు నియంత్రణలో తమ ప్రభుత్వం విజయం సాధించిందని తెలిపారు. ఈ తరహా ఘటనలు తగ్గుముఖం పట్టాయని కూడా ఆయన పేర్కొన్నారు. ఎనిమిదేళ్ల తర్వాత జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాద ఘటనలు, ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాటు, వామపక్ష తీవ్రవాదాన్ని నియంత్రించడంలో ప్రభుత్వం చాలావరకు విజయం సాధించిందన్నారు
హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎస్వీపీఎన్పీఏ)లో ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) ప్రొబేషనర్ల 74వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్లో అమిత్ షా మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. అలాగే, భారత ప్రభుత్వ సంస్థల నాయకత్వంలో దేశవ్యాప్తంగా పోలీసు బలగాలు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) వంటి సంస్థకు వ్యతిరేకంగా ఒకే రోజులో విజయవంతమైన ఆపరేషన్ ను నిర్వహించాయని గుర్తు చేశారు. ఎనిమిదేళ్ల తర్వాత జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాద ఘటనలు, ఈశాన్య రాష్ట్రాల్లో తిరుగుబాటు, వామపక్ష తీవ్రవాదాన్ని నియంత్రించడంలో ప్రభుత్వం చాలావరకు విజయం సాధించిందన్నారు.
Attended the passing out ceremony of the 74 RR IPS batch of Sardar Vallabhbhai Patel National Police Academy, Hyderabad.
I believe that these officers will set an example of stellar service to the nation's security in the ever-changing security scenario. pic.twitter.com/dTlgyJpx7d
ఇటీవల పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను నిషేధించడం ద్వారా ప్రపంచానికి విజయవంతమైన ఉదాహరణను అందించామని అమిత్ షా చెప్పారు. ప్రజాస్వామ్యం పట్ల మన నిబద్ధత ఎంత దృఢంగా, బలంగా మారిందో ఇది తెలియజేస్తోందన్నారు. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్, ఉగ్రవాద నిరోధక చట్టాలకు పటిష్టమైన ఫ్రేమ్ వర్క్, ఏజెన్సీల బలోపేతం, దృఢమైన రాజకీయ సంకల్పం కారణంగా ఉగ్రవాద సంబంధిత ఘటనలు తగ్గాయని కూడా ఆయన పేర్కొన్నారు. గత ఏడు దశాబ్దాల్లో దేశం అనేక ఒడిదుడుకులను చవిచూసిందనీ, అంతర్గత భద్రతలో అనేక సవాళ్లను ఎదుర్కొందని అమిత్ షా అన్నారు. కరోనా కష్టకాలంలో 36 వేల మందికి పైగా పోలీసులు ప్రాణత్యాగం చేశారన్నారు.
ఎప్పటికప్పుడు మారుతున్న భద్రతా పరిస్థితుల్లో ఈ అధికారులు దేశ భద్రతకు అద్భుతమైన సేవలను అందిస్తారని తాను నమ్ముతున్నానని అన్నారు. "ఒక గొప్ప భారతదేశానికి ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పునాది వేస్తున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి ఉత్తీర్ణులైన అధికారులు నూతన భారత అంతర్గత భద్రతకు భరోసా ఇవ్వాల్సి ఉంటుంది. అవి న్యాయంపై నమ్మకాన్ని పెంచుతాయనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు" అని అమిత్ షా తన ప్రసంగంలో పేర్కొన్నారు. కాగా, 166 మంది ఐపీఎస్ ఆఫీసర్ ట్రైనీలు, విదేశాల నుంచి వచ్చిన 29 మంది ఆఫీసర్ ట్రైనీలు సహా మొత్తం 195 మంది ఆఫీసర్ ట్రైనీలు దీక్షాత్ పరేడ్ లో పాల్గొన్నారు.