దారుణం: మహిళను వివస్త్రను చేసి నగ్న ఫొటోలు తీసి రేప్ చేసిన లాయర్

By telugu teamFirst Published Jul 22, 2021, 8:24 AM IST
Highlights

తమిళనాడులో ఓ న్యాయవాది భర్తతో విడాకుల కోసం తనను అశ్రయించిన ఓ వివాహిత పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించాడు. మహిళను వివస్త్రను చేసి, నగ్నంగా ఫొటోలు తీసి అత్యాచారం చేశాడు.

చెన్నై: తమిళనాడులో సాయం కోరిన వచ్చిన మహిళపై ఓ న్యాయవాది తన క్రౌర్యం ప్రదర్శించాడు. అత్యంత నీచంగా ఆ మహిళ పట్ల వ్యవహరించాడు. భర్తతో విడాకులు తీసుకోవడానికి తనను ఆశ్రయించిన మహిళపై అత్యాచారం చేశాడు. 

వివస్త్రను చేసి మహిళ నగ్నంగా ఉన్న దృశ్యాలను ఫొటోలు తీశాడు. ఆ తర్వాత బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు. ఆ న్యాయవాదిని పోలీసులు అరెస్టు చేశారు. తిరువళ్లూరు సమీపంలోని మనవాళనగర్ కు చెందిన వివాహిత విడాకులు తీసుకోవడానికి తిరువళ్లూరు జిల్లా కోర్టులో పనిచేస్తున్న న్యాయవాది డార్జన్ (44)ను కలిసింది. 

కేసుకు సంబంధించిన ఆధారాలను ఇంటికి వచ్చి ఇవ్వాలని డార్జన్ చెప్పాడు. దాంతో ఆమె అతని ఇంటికి వెళ్లింది. ఇంటికి వచ్చిన మహిళకు నిద్రమాత్రలు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు. ఆ డ్రింక్ తాగిన ఆమె స్పృహ తప్పింది. ఆమెను వివస్త్రను చేసి నగ్న ఫొటోలు తీశాడు. ఆ తర్వాత అత్యాచారం చేశాడు.

ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతానని బెదిరించాడు. అలా బెదిరించి మహిళ నుంచి 7 లక్షల రూపాయలు వసూలు చేశాడు. డబ్బుల కోసం అతను మహిళను పలు మార్లు బెదిరించాడుయ దానిపై ఆమె తిరువళ్లూరు మహిళా కోర్టులో ఫిర్యాదు చేసింది. 

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కొడైకెనాల్ లో ఉన్న డార్జన్ ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కోర్టులో హాజరు పరిచి పుళల్ జైలుకు తరలించారు. 

click me!