ఉత్తరప్రదేశ్ అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్ లో బీజేపీ క్లీన్ స్వీప్.. ఖాతా తెరవలేకపోయిన ప్రతిపక్షాలు..

Published : May 14, 2023, 02:05 PM IST
ఉత్తరప్రదేశ్ అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్ లో బీజేపీ క్లీన్ స్వీప్.. ఖాతా తెరవలేకపోయిన ప్రతిపక్షాలు..

సారాంశం

ఉత్తరప్రదేశ్ లో అర్బన్ లోకల్ బాడీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 17 మేయర్ సీట్లను గెలుచుకుంది. అలాగే 544 నగర పంచాయతీ సీట్లలో గెలుపొందింది.

ఉత్తరప్రదేశ్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బీజేపీ ఘన విజయం సాధించింది. 17 మేయర్ స్థానాలను గెలుచుకుంది. ఈసారి మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ రేసులో ప్రతిపక్షాలు ఖాతా తెరవలేకపోయాయి. బీజేపీ రంగంలోకి దించిన 17 మంది మేయర్ అభ్యర్థులలో 14 మంది కొత్తవారు కావడం గమనార్హం. 

ఘోరం.. పీటీ క్లాస్ మిస్ అయ్యారని 200 సిట్ అప్ ల శిక్ష.. 170 మంది బాలికలకు అస్వస్థత..

బీజేపీ మేయర్ స్థానాలను గెలుచుకోవడమే కాకుండా 199 నగర పాలిక (మునిసిపల్ బోర్డు) స్థానాలు, 544 నగర పంచాయతీ సీట్లలో తన సంఖ్యను మెరుగుపరుచుకుంది. ఎస్పీ, బీఎస్పీ, ఎంఐఎం మధ్య ముస్లిం ఓట్లు చీలిపోవడం వల్ల పశ్చిమ యూపీలో పలు స్థానాల్లో బీజేపీకి కలిసి వచ్చింది. మీరట్ లో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం బీజేపీకి ప్రధాన పోటీదారుగా అవతరించి సమాజ్ వాదీ పార్టీని మూడో స్థానానికి నెట్టింది. మీరట్ లో ఎంఐఎం రెండు వార్డులను, చివరిగా ఫలితం వచ్చే వరకు ఆలయ పట్టణం అయోధ్యలో ఒక వార్డును మాత్రమే గెలుచుకుంది.

కర్ణాటక ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన 13 మంది మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు.. ఎవరెవరంటే ?

అయితే ఈ ఎన్నికల్లో మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపల్ బోర్డులు, నగర పంచాయతీ స్థాయిలో వివిధ పదవులకు 350 మందికి పైగా ముస్లిం అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వడం ద్వారా ముస్లిం వ్యతిరేక పార్టీ అనే తన ఇమేజ్ ను విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ ప్రయత్నించింది. మరో వైపు 17 మేయర్ స్థానాలకు బీఎస్పీ 11 మంది ముస్లింలను బరిలోకి దింపింది.

24 ఏళ్ల తరువాత కాంగ్రెస్ కంచుకోటను కైవసం చేసుకున్న ఆప్.. డిపాజిట్ కోల్పోయిన బీజేపీ.. ఎక్కడంటే ?

అదే సమయంలో పోటీలో ఉన్న మొత్తం అభ్యర్థుల్లో 66 శాతం మంది స్వతంత్రులు ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ వంటి అనేక రాజకీయ పార్టీలకు గట్టి పోటీ ఇచ్చారు. రాజకీయ పార్టీల్లో బీజేపీ అత్యధికంగా 10,758 మంది అభ్యర్థులను నిలబెట్టగా, ఎస్పీ (5231), బీఎస్పీ (3787), కాంగ్రెస్ (2994), ఆమ్ ఆద్మీ పార్టీ (2447) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 

మహారాష్ట్రలోని అకోలాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. 144 సెక్షన్ విధించిన పోలీసులు.. 120 మందిపై కేసులు

2024 సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు వచ్చిన యూపీ మున్సిపల్ పోల్స్ లో.. బీజేపీకి తానే బలమైన ప్రత్యర్థి అని చూపించేందుకు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చేసిన ప్రయత్నాలు విజయం కాలేవు. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు అండగా నిలిచిన ముస్లిం సామాజికవర్గం మద్దతును కూడా ఆయన ఈ పోల్స్ లో కోల్పోయారు. ఎస్పీ ఎంపీగా ఎస్టీ హసన్ ఉన్న మొరాదాబాద్ లో మేయర్ ఎన్నికల్లో ఆ పార్టీ నాలుగో స్థానానికి పడిపోయింది. ఎస్పీ ఎంపీ షఫీకుర్ రెహ్మాన్ బార్క్ లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంభాల్ లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu