సాల్వార్ తో ఉరేసి బాలికను చంపేశారు: రేప్ చేసి హత్య చేశారని ఫ్యామిలీ ఆరోపణ

By telugu teamFirst Published Jun 22, 2021, 8:58 AM IST
Highlights

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది ఎనిమిదేళ్ల వయస్సు గల బాలికను గుర్తు తెలియని దుండగులు మెడకు సాల్వార్ బిగించి హత్య చేశారు. ఈ సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది.

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన సంఘటన జరిగింది. ఎనిమిదేళ్ల బాలికను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. బాలిక ధరించిన సాల్వార్ తోనే గొంతు బిగించి ఆమెను హత్య చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పాస్గావన్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో జరిగినట్లు పోలీసులు సోమవారంనాడు చెప్పారు. 

బాలిక శవం చెరుకు తోటలో ఆదివారం రాత్రి కనిపించింది. ఆమె మెడ చుట్టూ సాల్వార్ బిగించి ఉంది. అత్యాచారం చేసి బాలికను హత్య చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. గొంతు బిగించి బాలికను చంపినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు చెప్పారు. 

కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేసు ఛేదించడానికి, నిందితులను అరెస్టు చేయడానికి డిప్యూటీ ఎస్పీ నేతృత్వంలో ఐదు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.

click me!