అక్కాచెల్లెళ్ల కిడ్నాప్.. గ్యాంగ్ రేప్

By ramya neerukondaFirst Published Nov 17, 2018, 3:08 PM IST
Highlights

ఇద్దరు అక్కాచెల్లెళ్లను కిడ్నాప్ చేసి.. రెండు రోజుల పాటు వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 

ఇద్దరు అక్కాచెల్లెళ్లను కిడ్నాప్ చేసి.. రెండు రోజుల పాటు వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన త్రిపురలోని ఉనాకోటి జిల్లాలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అగర్తాకు  చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లను ఈ నెల 9వ తేదీన కైలాషహర్ పట్టణం సమీపంలోని ఓ బ్రిడ్జి వద్ద ఇంటికి వెళ్లడానికి వాహనాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో ఓ ఆటో వచ్చి వారి ముందు ఆగింది. అందులో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు మగ ప్రయాణికులు ఉన్నారు. ఆటో డ్రైవర్ తెలిసిన వ్యక్తే కావడంతో అక్కచెల్లెళ్లిద్దరూ ఆటో ఎక్కారు.

వారు ఆటోగా ఎక్కగానే.. అందులోనే ఇద్దరు వ్యక్తులు.. ఈ యువతులను టవల్ కట్టేశారు. అనంతరం ఆటో డ్రైవర్ వారిని పట్ణణానికి దూరంగా  ఓ ప్రాంతానికి తీసుకువెళ్లాడు.  అక్కడ ఓ గదిలో ఇద్దరినీ బంధించి..వారిపై రెండు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారిని వదిలేశారు.

కాగా.. బాధితురాళ్లు.. పోలీసులను ఆశ్రయించి.. జరిగిన ఘటనను వివరించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆటో డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు. 

click me!