మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. నిందితుల్లో మైనర్ బాలుడు..!

By telugu news teamFirst Published Aug 31, 2021, 9:08 AM IST
Highlights

మొత్తం ఐదుగురు వ్యక్తులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఈ విషయం ఎవరికీ చెప్పొద్దంటూ.. బాలికను బెదిరించడం గమనార్హం.

16ఏళ్ల బాలికపై ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా...  నిందితుల్లో ఒకరు మైనర్ బాలుడు కూడా ఉండటం గమనార్హం. ఈ సంఘటన రాజస్థాన్  రాష్ట్రం నాగపూర్ జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నాగపూర్ జిల్లాకు చెందిన 16ఏళ్ల బాలిక ను పక్కింటి వ్యక్తి హరిప్రసాద్ ఏదో పని ఉందని.. ఇంటికి పిలిచాడు. అక్కడకు వెళ్లే సరికి.. అతనితోపాటు.. మరో నలుగురు వ్యక్తులు కూడా అక్కడ ఉండటం గమనార్హం. మొత్తం ఐదుగురు వ్యక్తులు బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఈ విషయం ఎవరికీ చెప్పొద్దంటూ.. బాలికను బెదిరించడం గమనార్హం.

ఈ ఘటన తర్వాత బాలిక పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. బాలిక వింత ప్రవర్తన చూసి తల్లిదండ్రులకు అనుమానం కలిగింది. దీంతో.. ఆమెను వారు ఏం జరిగిందని అడగగా.. బాలిక జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో...  బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు  చేశాడు.  నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఓ మైనర్ బాలుడు కూడా ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

click me!