BoardExams 2022:బోర్డు ఎగ్జామ్స్ రద్దు చేయాలని పిటిషన్.. కొట్టివేస్తూ తిరస్కరించిన సుప్రీంకోర్టు..

By asianet news teluguFirst Published Feb 23, 2022, 7:01 PM IST
Highlights

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్, ఇతర రాష్ట్ర బోర్డులు నిర్వహించే 10వ తరగతి, 12వ తరగతి ఆఫ్‌లైన్ పరీక్షలను రద్దు చేయాలంటూ చేసిన పిటిషన్ను స్వీకరించడానికి భారత సుప్రీంకోర్టు నిరాకరించింది.

ఆఫ్‌లైన్ బోర్డు పరీక్షలను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు నేడు కొట్టివేసింది. ఇలాంటి పిటిషన్‌లు విద్యార్ధుల్లో గందరగోళం  సృష్టిస్తాయని సుప్రీంకోర్టు బుధవారం ఈ విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఈ తీర్పుతో ఈ ఏడాది 10, 12వ తరగతి పరీక్షలు సమయానికి ఆఫ్‌లైన్‌లో నిర్వహించబడతాయని దాదాపు స్పష్టమైంది. అయితే, ఈ విషయంలో తుది నిర్ణయం ఇంకా అప్‌డేట్‌ను సంబంధిత రాష్ట్ర, విద్యా బోర్డు తీసుకోవాల్సి ఉంటుంది. 

దేశవ్యాప్తంగా 10, 12వ తరగతి విద్యార్థులకు ఆఫ్‌లైన్‌లో నిర్వహించే పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. CBSE, ICSE, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) వంటి అన్ని కేంద్ర ఇంకా రాష్ట్ర విద్యా బోర్డులు అలాగే వివిధ రాష్ట్రాల విద్యా బోర్డులు నిర్వహించే 10, 12 తరగతులకు ఆఫ్‌లైన్ పరీక్షలను రద్దు చేయాలని పిటిషన్లో కోరింది.   

దీనిపై జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సుప్రీంకోర్టులో విచారణ చేపట్టింది. ధర్మాసనంలో జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ సీటీ రవికుమార్ ఉన్నారు. కోర్టులో సిబిఎస్‌ఇ టర్మ్-1 ఫలితాలకు సంబంధించి తేదీ స్పష్టంగా లేదని పిటిషనర్ ప్రస్తావించగా, కోర్టు అభ్యతరం వ్యక్తం చేస్తూ సిబిఎస్‌ఇ ప్రక్రియ కొనసాగుతోందని, మూల్యాంకనం పూర్తి చేయనివ్వండి అని చెప్పారు. 

మీరు వాదనలు వినకుండా నేరుగా తీర్పు ఇచ్చేలా మాట్లాడుతున్నారని ధర్మాసనం పేర్కొంది. విచారణ సందర్భంగా జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్‌తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. పిటిషనర్‌కు జరిమానా కూడా విధించాలని ఆదేశించింది. 

ఎలాంటి జరిమానా 
దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఈ పిటిషన్‌లో ప్రాతినిధ్యం వహించారు. ఆఫ్‌లైన్ పరీక్షలను రద్దు చేసి ఇతర మూల్యాంకన పద్ధతులను రూపొందించేలా సీబీఎస్‌ఈ, ఇతర కేంద్ర, రాష్ట్ర విద్యా బోర్డులకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. ఎందుకంటే, ప్రస్తుతం 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలను ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని అన్ని బోర్డులు ప్రతిపాదించాయి. దీనిపై న్యాయస్థానం మాట్లాడుతూ.. పరీక్షలను రద్దు చేసేంత సంక్షోభం లాంటి పరిస్థితి ప్రస్తుతం లేదని పేర్కొంది. ఇలాంటి పిటిషన్లు విద్యార్థుల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి అని తెలిపింది.

click me!