బంగ్లాదేశ్ లో కదిలే బస్సులో యువతిపై గ్యాంగ్ రేప్: నిర్భయ తరహాలోనే...

By telugu teamFirst Published May 30, 2021, 8:10 AM IST
Highlights

బంగ్లాదేశ్ లో నిర్భయ వంటి ఘటన జరిగింది. కదిలే బస్సులో ఆరుగురు దుండగులు మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెకు తెలిసిన వ్యక్తిని నిర్బంధించి ఆ ఘాతుకానికి పాల్పడ్డారు.

ఢాకా: బంగ్లాదేశ్ లో ఢిల్లీ నిర్భయ ఘటన వంటిది జరిగింది. 22 ఏళ్ల యువతిపై కదిలే బస్సులో సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశఆరు సావర్ ప్రాంతంలోని అశులియా పశువుల మార్కెట్ కు సమీపంలో శుక్రవారం అర్థరాత్రి ఆ సంఘటన చోటు చేసుకుంది. 

బాధితురాలు మణిక్ గంజ్ లోని తన సోదరి ఇంటి నుంచి నారాయణగండ్ లో ఉ్న తన ఇంటికి బయలుదేరింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు బస్సు కోసం నబినగర్ బస్ స్టేషన్ కు చేరుకుంది. అక్కడ అప్పటికే పరిచయం ఉన్న నజ్ముల్ అనే వ్యక్తి ఆమెను కలిశాడు. ఇద్దరు కలిసి అక్కడికి వచ్చిన బస్సులో ఎక్కారు. 

నిందితులు బస్సులోని ప్రయాణికులను గమ్యాలకు రాకుండా ముందుగానే దించేశారు. నజ్ముల్ ను, బాధితురాలని అడ్డుకుని నబినగర్ తీసుకుని వెళ్లారు. ఆరుగురు దుండగులు ఆమెపై బస్సులో అత్యాచారం చేశారు. ఆ సమయంలో నజ్ముల్ అరుపులు విని గస్తీ తిరుగుతున్న పోలీసులు వచ్చి వాహనాన్ని ఆపి వారిద్దరినీ రక్షించారు. 

బస్సును స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కోర్టు వారికి నాలుగు రోజుల రిమాండ్ విధించింది.  నిందితులను ఆర్మన్ (18), షాజు (20), సుమోన్ మియా (24), మోనోవర్ (2), షోహాగ్ (25), సైఫుల్ ఇస్లాం (0)లుగా గుర్తించారు   

click me!