ప్రధాని నరేంద్ర మోదీకి ఇతర దేశాల్లో మంచి గౌరవం లభిస్తోంది. ఇప్పటికే పలు దేశాలు పలు అవార్డులను ప్రదానం చేసి మోదీని సత్కరించాయి. తాజాగా ఈ జాబితాలోకి శ్రీలంక వచ్చి చేరింది. తాజాగా శ్రీలంక పర్యటనలో ఉన్న మోదీకి ఆ దేశం మిత్ర విభూషణ అవార్డును అందించింది. ఇది విదేశాల్లో మోదీకి లభించిన 22వ అంతర్జాతీయ గౌరవం కావడం విశేషం. ఈ అవార్డు భారత్-శ్రీలంక దేశాల మధ్య ఉన్న బలమైన స్నేహబంధానికి ప్రతీకగా నిలుస్తోంది.
అవార్డులో ఉన్న ప్రత్యేక చిహ్నాల అర్థం:
ధర్మ చక్రం – రెండు దేశాల మధ్య ఉన్న బౌద్ధ సాంస్కృతిక వారసత్వాన్ని సూచిస్తుంది.
పుణ కలశం – నూతన శుభప్రద ప్రారంభాలను, ఐశ్వర్యాన్ని సూచిస్తుంది.
నవరత్నాలు – శ్రీలంక, భారత్ల మధ్య ఉన్న దీర్ఘకాలిక స్నేహాన్ని సూచిస్తూ, ఒక లోకగోళం చుట్టూ పద్మదళాలలో అలకరించారు.
సూర్యుడు, చంద్రుడు – రెండు దేశాల మధ్య స్నేహం శాశ్వతంగా ఉంటుందని సూచిస్తుంది.
ఈ గౌరవం ప్రధాని మోదీ దూరదృష్టి గల నాయకత్వానికి, ప్రాంతీయ సహకారం, సాంస్కృతిక పునరుద్ధరణ, ఆధ్యాత్మిక మార్గదర్శనానికి గుర్తింపుగా నిలుస్తోంది. ఇది భారతదేశం శాంతి, సామరస్యంతో పాటు సమూహ అభివృద్ధికి దోహదపడే దేశమని ప్రపంచానికి చాటి చెబుతుంది.