భారత ప్రధాని నరేంద్ర మోదీ థాయ్లాండ్ పర్యటనలో ఉన్నారు. తమ దేశానికి విచ్చేసిన అతిథి మోదీకి థాయ్లాండ్ ప్రధానమంత్రి ప్రత్యేక బహుమతిని ఇచ్చారు. అదేంటో తెలుసా?
PM Narendra Modi Thailand Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ థాయ్లాండ్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా థాయ్లాండ్ ప్రధానమంత్రి పెయిటోంగ్టార్న్ షిన్వత్రా ఆయనకు “ది వరల్డ్ త్రిపీటిక : సజ్జయ పొనెటిక్ ఎడిషన్” అనే త్రిపిటకాన్ని బహుమతిగా ఇచ్చారు.
మోదీకి థాయ్లాండ్ ప్రధానమంత్రి ఇచ్చిన బహుమతి
త్రిపిటక (పాలీలో) లేదా త్రిపిటకం (సంస్కృతంలో) అనేది బుద్ధుని బోధనల యొక్క ప్రసిద్ధ సమాహారం. ఇందులో 108 సంపుటాలు ఉన్నాయి. ఇది ప్రధాన బౌద్ధ గ్రంథంగా పరిగణించబడుతుంది. ప్రధాని మోదీకి అందించిన ప్రతి పాలి మరియు థాయ్ భాషలలో వ్రాయబడింది. ఇది 90 లక్షలకు పైగా అక్షరాల యొక్క ఖచ్చితమైన ఉచ్చారణను నిర్ణయిస్తుంది.
A very special gesture!
I am grateful to Prime Minister Paetongtarn Shinawatra for giving me a copy of the Tipitaka in Pali. Pali is indeed a beautiful language, carrying within it the essence of Lord Buddha’s teachings. As you are all aware, our Government had conferred the… pic.twitter.com/FDTx4yfmDd
త్రిపిటకా ప్రత్యేక ఎడిషన్
ఈ ప్రత్యేక ఎడిషన్ 2016లో థాయ్ ప్రభుత్వం ప్రపంచ త్రిపిటకా ప్రాజెక్ట్లో భాగంగా రాజు భూమిబోల్ అదుల్యదేజ్ (రామా IX) మరియు రాణి సిరికిట్ యొక్క 70 సంవత్సరాల పాలనను పురస్కరించుకుని విడుదల చేసింది.