Face Glow: స్పూన్ బియ్యం పిండితో ఫేషియల్ లాంటి గ్లో.. ముఖానికి ఎలా రాయాలంటే..!

Published : Nov 03, 2025, 09:22 AM IST

Face Glow:  సహజంగా అందాన్ని పెంచుకోవడానికి దాదాపు అందరూ శెనగ పిండి వాడుతూ ఉంటారు. కానీ, శెనగ పిండితో మాత్రమే బియ్యం పిండిని వాడినా కూడా ముఖంలో  అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.

PREV
14
face glow

చర్మం మన శరీరంలోని అత్యంత సున్నితమైన భాగం. మనం ప్రతిరోజూ దానిని ఎంత బాగా చూసుకుంటే... మన ముఖం అంత అందంగా, మెరుస్తూ కనపడుతుంది. కానీ ఈ రోజుల్లో కాలుష్యం, ఒత్తిడి, నిద్రలేని, అసమతుల్య ఆహారం ఇవన్నీ... ముఖ కాంతిని దెబ్బ తీసేస్తున్నాయి. కొంత మంది ఈ సమస్యల నుంచి బయటపడటానికి ఖరీదైన క్రీములు, ఫేస్ సీరమ్స్, ఫేస్ వాష్ లు వంటివి ఉపయోగిస్తారు. కానీ వాటిలో ఉన్న రసాయనాలు చర్మానికి తాత్కాలిక మెరుపు ఇచ్చినా... ఫ్యూచర్ లో ముఖాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది.

24
ముఖానికి బియ్యం పిండి

అందుకే.. ఎప్పుడైనా అందాన్ని పెంచుకోవడానికి మార్కెట్లోకి కెమికల్స్ ఉత్పత్తులను ఎంచుకోవడానికి బదులుగా... సహజ ఉత్పత్తులపై ఆధారపడాలి. అప్పుడే... ఎలాంటి డ్యామేజ్ లేకుండా... ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇలా మన అందాన్ని రెట్టింపు చేసే వాటిలో బియ్యం పిండి ముందు వరసలో ఉంటుంది. సెనగ పిండిని చాలా చర్మ సౌందర్యానికి వాడతారు. కానీ.. బియ్యం పిండి అంతకంటే ఎక్కువ రెట్లు మన స్కిన్ కేర్ లో కీలక పాత్ర పోషిస్తుంది. మరి, ఈ బియ్యం పిండిని ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం...

34
బియ్యం పిండిలో పోషకాలు....

బియ్యంలో విటమిన్ బి, పెరులిక్ యాసిడ్, అల్లంటోయిన్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. ఇవి చర్మంలోని దెబ్బతిన్న కణాలను రిపేర్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా.. చర్మానికి సహజ కాంతిని వెదజల్లుతాయి. బియ్యం పిండితో తయారు చేసిన ఫేస్ ప్యాక్ లు, స్క్రైబ్ లు చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. ముఖంపై ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగించడంలోనూ సహాయపడతాయి.

44
బియ్యం పిండితో ఫేస్ ప్యాక్....

రెండు స్పూన్ల బియ్యం పిండి, ఒక స్పూన్ పాలు, కొద్దిగా తేనె కలిపి మెత్తని పేస్టులాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడిగేస్తే సరిపోతుంది. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే... చర్మం సహజంగా మెరిసిపోతుంది.

అయితే.. బియ్యం పిండి ఎంత మంచిదైనా మరీ ఎక్కువగా వాడితే స్కిన్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. చర్మంపై పేరుకుపోయిన తేమ అంతా పోయి... ముఖం పొడిబారే ప్రమాదం ఉంది. అంతేకాదు.. సున్నితమైన చర్మం ఉన్నవారు ఇది వాడకపోవడమే మంచిది. అందుకే.. వాడే ముందు ప్యాచ్ టెస్టు చేసుకోవాలి.

మరొక ముఖ్యమైన విషయం — బియ్యం పిండి ప్యాక్ వేసిన తర్వాత ముఖాన్ని బాగా శుభ్రం చేయాలి. లేకపోతే, పిండిలోని కణాలు రంధ్రాలను మూసివేసి మొటిమల సమస్యకు దారితీస్తాయి.

మొత్తానికి, బియ్యం పిండి మన ఇంట్లో లభించే సహజ చర్మ సంరక్షణ మిత్రం. ఇది ఖరీదైన క్రీములకన్నా సులభం, చవక. ఎలాంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు. అయితే, మీ చర్మ రకానికి అనుగుణంగా దీన్ని సరిగ్గా వాడితే, చర్మం సహజంగా మెరిసిపోతుంది, ఆరోగ్యంగా మారుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories