Telangana Weather : ఈ జిల్లావాసులు కొంచెం జాగ్రత్త .. ఎల్లో అలర్ట్ జారీచేసారు

Published : May 21, 2025, 09:17 AM ISTUpdated : May 21, 2025, 09:20 AM IST

తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు… ఈ జిల్లాలేవో తెలుసా? 

PREV
16
తెలంగాణలో భారీ వర్షాలు

Telangana Rain Alert : వేసవికాలం ఇంకా ముగియనేలేదు అప్పుడే వర్షాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తగ్గి వాతావరణం పూర్తిగా చల్లబడింది... సాయంత్రం అయ్యిందంటే చాలు వర్షకాలంలో మాదిరిగా వానలు దంచికొడుతున్నాయి. అయితే ఈ వానలు మరికొన్నిరోజులు ఇలాగే కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. వర్షాల తీవ్రత పెరిగింది... ఎంతలా అంటే వాగులు వంకలు, చెరువుల్లో వరదనీరు చేరి ప్రమాదకరంగా మారుతున్నాయి.

26
తెలంగాణలో మరో ఐద్రోజులు వర్షాలు

తెలంగాణలో ప్రస్తుతం ఆకాశమంతా మేఘాలు కమ్ముకుని ఉన్నాయి. పలు జల్లాల్లో రాత్రి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షం మరో నాలుగైదు రోజులు కొనసాగుతుందని... కొన్నిచోట్ల భారీనుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలోనే వర్షాలు కురిసే జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

36
హైదరాబాద్ లో వానలే వానలు

రాజధాని నగరం హైదరాబాద్ వర్షాలతో తడిసి ముద్దవుతోంది. ప్రతిరోజూ నగరంలో ఏదోచోట వర్షం కురుస్తోంది... అప్పుడప్పుడు మోస్తరు వానలు ఒక్కోసారి మోకాల్లోతు వరదనీరు రోడ్డుపైకి చేరేస్ధాయిలో వానలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఈదురుగాలులు తోడవడంతో చెట్లు, హోర్డింగ్ లు కూలి నానా భీభత్సం జరుగతోంది. అయితే హైదరాబాద్ లో మరో ఐదురోజులు ఇదే పరిస్థితి ఉంటుందని... వర్షాలు దంచి కొడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

46
తెలంగాణలో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలోని మరికొన్ని జిల్లాల్లో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. హైదరాబాద్ శివారుజిల్లాలైన ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, మల్కాజ్ గిరి, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లో మరో ఐద్రోజులు వర్షాలు కొనసాగుతాయి. అలాగే మహబూబ్ నగర్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయట. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసారు.

56
తెలంగాణను కమ్మేసిన మేఘాలు

ఇవాళ(బుధవారం) తెలంగాణవ్యాప్తంగా ఆకాశం మేఘాలతో కమ్మేసివుండి చల్లని వాతావరణం ఉంటుందట. మధ్యాహ్నం నుండి వర్షాలు కురవడం ప్రారంభం అవుతుంది... సాయంత్రానికి ఇవి మరింత ముదిరి భారీ వానలుగా మారతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇలా పలుచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

66
తెలంగాణలో ఆకాశం మేఘావృతం

ఈ వర్షాలకు తోడు పిడుగులు పడే అవకాశాలున్నాయని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరం అయితేనే వర్షాలు కురిసే సమయంలో ఇళ్లనుండి బయటకు రావాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా రైతులు మధ్యాహ్నం లోపే వ్యవసాయ పనులేమైనా ఉంటే పూర్తిచేసుకోవాలి... సాయంత్రం సమయంలో పొలంలో, చెట్లకింద ఉండకూడదని సూచిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, విపత్తు నిర్వహణ సంస్థ సిబ్బంది కూడా అప్రమత్తం అయ్యారు... వర్షతీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రజలకు అవసరం అయితే సాయం చేసేందుకు సిద్దమయ్యారు.

Read more Photos on
click me!

Recommended Stories