తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ఇవాళ (నవంబర్ 27, గురువారం) ప్రారంభమయ్యింది. మూడ్రోజులు అంటే నవంబర్ 29 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 11 తేదీన మొదటి విడత పోలింగ్ జరిగి అదేరోజు ఓట్ల లెక్కింపు, పలితాలు వెలువడతాయి.
రెండో విడత నామినేషన్లు నవంబర్ 30న ప్రారంభమై డిసెంబర్ 2 వరకు కొనసాగుతాయి. డిసెంబర్ 14న పోలింగ్, ఓట్ల లెక్కింపు, పలితాల విడుదల జరుగుతుంది.
మూడో విడత నామినేషన్లు డిసెంబర్ 3న ప్రారంభమై డిసెంబర్ 5 వరకు కొనసాగుతాయి. డిసెంబర్ 17 పోలింగ్, ఓట్ల లెక్కింపు, పలితాల వెల్లడి ఉంటుంది.
ఇలా మొత్తం మూడు విడతల్లో రాష్ట్రంలోని 31 జిల్లాల 564 మండలాల్లోని 12,728 పంచాయతీలు, 1,12,243 వార్డులకు ఎన్నికలు నిర్వహించనునుంది EC. బ్యాలట్ పద్దతిలోనే ఈ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఎన్నికల కమీషన్ ప్రకటించింది.