ప్రభుత్వం పీపీపీ విధానంలో అత్యాధునిక పార్కింగ్ యార్డులను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ యార్డులలో బండిని భద్రపరిచినందుకు రోజువారీ రేట్లు ఇలా ఉండే అవకాశం ఉంది..
• బైక్: రోజుకు రూ. 20 - 30
• ఆటో: రోజుకు రూ. 35 - 50
• కారు: రోజుకు రూ. 60 - 80
• బస్సు/భారీ వాహనాలు: రోజుకు రూ. 200 - 300
త్వరలోనే ఈ ముసాయిదాపై ప్రజల అభిప్రాయాలను సేకరించి, తెలంగాణ ప్రభుత్వం ఈ కొత్త పార్కింగ్ చట్టాన్ని అమల్లోకి తీసుకురానుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూపొందించిన ఈ పాలసీ ఇప్పుడు ప్రభుత్వ ఆమోదం కోసం వేచి చూస్తోంది.