రెండో దశ ఎన్నికల నామినేషన్లు నవంబర్ 30 నుంచి స్వీకరించనున్నారు. ఈ దశలో 4,333 సర్పంచ్ స్థానాలు, 38,350 వార్డుల ఎన్నికలు నిర్వహించనున్నారు.
మూడో విడత నామినేషన్ల స్వీకరణ డిసెంబర్ 3 నుంచి ప్రారంభమవుతుంది. ఈ దశలో 4,159 సర్పంచ్ స్థానాలు, 36,452 వార్డుల కోసం పోలింగ్ జరగనుంది.
ఈ మూడు విడతల పంచాయతీ ఎన్నికల ప్రక్రియను సమగ్రంగా సమయానుకూలంగా ముందుకు తీసుకెళ్లనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.