ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ (APSDMA) ప్రకారం, ఆదివారం సాయంత్రం నుంచి అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం పరిసరాలు, విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం, గుంటూరు, తిరుపతి వంటి జిల్లాల్లో వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు.