Rain Alert : ప్రస్తుత మండుటెండల నుండి తెలుగు ప్రజలకు త్వరలోనే ఉపశమనం లభించనుంది. వర్షాకాలం కాస్త ముందుగానే ప్రారంభం కానుందని భారత వాతావరణ శాఖ (IMD) చల్లని వార్త చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఇవాళ (మే 13 మంగళవారం) దక్షిణ అండమాన్, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించనున్నట్లు ప్రకటించింది. ఇవి ఈ నెలలోనే కేరళ తీరాన్ని తాకి వర్షాలు ప్రారంభం అవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.