తెలంగాణలో గ్రామీణ పర్యటనలు చేయనున్న ప్రపంచ సుందరీమణులు
మే 12 (సోమవారం) నుండి మిస్ వరల్డ్ 2025 కంటెస్టంట్స్ తెలంగాణలోని గ్రామీణ పర్యటనలో పాల్గొంటున్నారు. ఈ పర్యటనలో నాగార్జున సాగర్, బుద్ధవనం, రామప్ప దేవాలయం, యాదగిరిగుట్ట, పొచంపల్లి తదితర ప్రదేశాలను చూడనున్నారు. మే 12న బుద్ధపౌర్ణమి సందర్భంగా బుద్ధవనంలో కంటెస్టంట్స్ ధ్యానం కార్యక్రమాలలో పాల్గొంటారు. జటక వనం సందర్శన, విజయ విహార్, బుద్ధ మెడిటేషన్ హాల్లో కార్యక్రమాలు జరుగుతాయి.