2026 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం మొత్తం 132 మందిని పద్మ అవార్డులకు ఎంపిక చేసింది. ఇందులో 5 మందికి పద్మ విభూషణ, 13 మందికి పద్మ భూషణ, 114 మందికి పద్మశ్రీ ఇవ్వనున్నారు. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 11 మంది ప్రముఖులు పద్మ అవార్డులను కైవసం చేసుకున్నారు. అందులో తెలంగాణ నుంచి ఏడుగురు, ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. మాగంటి మురళీమోహన్(కళల విభాగం) , గద్దె బాబూ రాజేంద్ర ప్రసాద్(కళల విభాగం) , గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ (మరణానంతరం) కళల విభాగం, వెంపటి కుటుంబ శాస్త్రి (సాహిత్యం, విద్య) అలాగే తెలంగాణ నుంచి పద్మశ్రీకి.. దీపికా రెడ్డి (కళల విభాగం) , గూడూరు వెంకట రావు (వైద్య విభాగం), పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి (వైద్య విభాగం), చంద్రమౌళి గడ్డముణుగు (సైన్స్–ఇంజనీరింగ్), కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్ (సైన్స్, ఇంజనీరింగ్), కుమారస్వామి తంగరాజ్ (సైన్స్, ఇంజనీరింగ్), రామారెడ్డి మామిడి (మరణానంతరం)–పశుసంవర్థక విభాగం ఎంపికయ్యారు.