ఓఆర్ఆర్ కొత్త టోల్ ఛార్జీలివే..
ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ బాధ్యతను గతంలో హైదరాబాద్ మెట్రోపాలిటిన్ డెవలప్మెంట్ అథారిటీ చూసుకునేది. కానీ గత బిఆర్ఎస్ ప్రభుత్వం 2023 లో ఓఆర్ఆర్ ను ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థకు లీజుకు ఇచ్చారు. ఇప్పుడు ఈ సంస్థ ఓఆర్ఆర్ పై ప్రయాణించే వాహనాలపై టోల్ ఛార్జీలు పెంచింది.
కారు, జీపు, వ్యాను వంటి వాహనాలు ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కితే కిలోమీటర్ కు రూ.2.34 వసూలు చేసేవారు. దీన్ని పదిపైసలు పెంచి రూ.2.44 వసూలు చేస్తున్నారు. ఇక మినీ బస్, ఎల్సివి వాహనాలకు కిలోమీటర్ కు 20 పైసలు పెంచారు... అంటే ఇప్పటివరకు రూ.3.77 వసూలు చేసేవారు, కానీ ఇకపై రూ.3.94 వసూలు చేయనున్నారు.
పెద్ద బస్సులు, 2 యాక్సిల్ ట్రక్కులకు టోల్ రూ.6.69 నుండి రూ.7.00 కు పెంచారు. 3 యాక్సిల్ వాణిజ్య వాహనాలకు రూ.8.63 నుండి రూ.9.01 కి టోల్ పెంచారు. భారీ నిర్మాణ యంత్రాలకు రూ.12.40 నుండి రూ.12.96 కు, భారీ వాహనాలకు రూ.15.09 నుండి రూ.15.78 కి టోల్ ఛార్జీలు పెంచారు.