రూ.250 జీతం నుండి లక్షల కోట్ల ఆస్తుల వరకు... మరళి దివి ప్రయాణం :
కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని మంతెన మురళీ దివి స్వగ్రామం. ఆయన తండ్రి సత్యనారాయణ ప్రభుత్వ ఉద్యోగి. మద్యతరగతి కుటుంబానికి చెందిన సత్యనారాయణకు 13మంది సంతానం. వీరిలో ఒకరే మురళి దివి.
మురళి దివి తండ్రి ఆ రోజుల్లోనే డిగ్రి వరకు చదువుకున్నాడు. చదువు విలువ తెలిసిన వ్యక్తి కాబట్టి తన బిడ్డలందరికి మంచి చదువు అందించాలని ప్రయత్నించాడు. ఇది తనకు ఆర్థిక భారం అయినా ఆయన బిడ్డలను చదివించారు. కానీ మురళి చిన్నతనంలో పెద్దగా చదివేవాడు కాదు. పాఠశాల విద్యా ఎలాగోలా పూర్తిచేసినా ఇంటర్ లో అతడు ఫెయిల్ అయ్యాడు. కానీ తర్వాత కష్టపడి చదివి ఇంటర్మీడియట్ పూర్తిచేసాడు.
కర్ణాటక మణిపాల్ అకాడమీ నుండి బీఫార్మసి పూర్తిచేసాడు మురళి. ఇంటర్ లో ఫెయిలైన అతడు బీఫార్మసిలో విశ్వవిద్యాలయం టాపర్ గా నిలిచాడు. అదే యూనివర్సిటీ నుండి ఎంఫార్మసి పట్టాను గోల్డ్ మెడల్ తో సహా అందుకున్నాడు. తర్వాత తెలంగాణలోని కాకతీయ యూనివర్సిటీ నుండి ఫార్మాస్యూటికల్స్ సైన్సెస్ లో పిహెచ్డి పూర్తిచేసాడు. ఇలా ఓవైపు పిహెచ్డి చేస్తూనే మరోవైపు హైదరాబాద్ లోని వార్నర్ హిందుస్థాన్ సంస్థలో నెలకు రూ.250 జీతంతో పనిచేసాడు.
పిహెచ్డి తర్వాత ఫార్మా రంగంలో మంచి అవకాశాలున్నాయని తెలిసి అమెరికా వెళ్లాడు. యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ కాబట్టి అతడికి చాలా ఈజీగా అమెరికా వీసా వచ్చింది. దీంతో అతడు చేతిలో కొంత చిల్లర మాత్రమే పెట్టుకుని అమెరికా పయనమయ్యాడు. అక్కడ చాలాకాలం ఫార్మారంగంలో పనిచేసారు... అంచెలంచెలుగా ఎదిగా ఓ ఫార్మా కంపనీ వైస్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగాడు. లక్షల జీతం, మంచి ఉద్యోగంతో జీవితం హాయిగా సాగుతుండగా మరో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు మురళి.