అయితే ఈ ఆదివారం తెలంగాణ ప్రజలకు చాలా స్పెషల్ డే. ఆషాడమాసంలో వస్తున్న ఈ ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు జరుగుతాయి. లష్కర్ బోనాలుగా పిలిచే ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అమ్మవారికి బోనాల సమర్పణ, పలహారం బండ్ల ఊరేగింపు, భవిష్యవాణి... ఇలా రెండు రోజులపాటు బోనాల వేడుకలు అట్టహాసంగా జరుగుతాయి.
ఇలా ఆది, సోమవారం రెండ్రోజులు సికింద్రాబాద్ బోనాల వేడుకలు జరుగుతాయి. ఈ సందర్భంగా ఈ ప్రాంతమంతా భక్తులు, బోనాల ఊరేగింపులు, రాజకీయ నాయకులు, విఐపిల రాకపోకలు, పలహారం బండ్లతో రద్దీగా ఉంటుంది. కాబట్టి సోమవారం కూడా సికింద్రాబాద్ ఉజ్జయిని ఆలయం సమీపంలోని స్కూళ్లు, కాలేజీలతో పాటు వ్యాపారసంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందికి సెలవు ఉండే అవకాశాలున్నాయి. అంటే రాష్ట్రవ్యాప్తంగా వచ్చే శని, ఆదివారం సెలవులుంటే సికింద్రాబాద్ ప్రాంతంలో మాత్రం సోమవారం కూడా సెలవు ఉండే అవకాశాలున్నాయి.
అయితే ఈ సోమవారం సెలవులపై సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన విద్యాశాఖ అధికారులు, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే వ్యాపారసంస్థల యాజమాన్యాలు తమ ఉద్యోగుల సెలవులపై నిర్ణయం తీసుకుంటాయి. కాబట్టి అధికారికంగా సమాచారం ఉంటేనే సెలవుగా పరిగణించాలి.