డిసెంబర్ చివరి నాలుగు రోజుల్లోనే అమ్మకాలు ఊపందుకున్నాయి. ఎక్సైజ్ శాఖ లెక్కల ప్రకారం
డిసెంబర్ 28న రూ.182 కోట్లు
డిసెంబర్ 29న రూ.282 కోట్లు
డిసెంబర్ 30న రూ.375 కోట్లు
డిసెంబర్ 31న రూ.400 కోట్లకు పైగా డిపోల నుంచి వైన్ షాపులకు చేరాయి. ప్రీమియం బ్రాండ్లు, బీర్లు, విస్కీలు భారీగా విక్రయమయ్యాయి. కొత్త విధానం డిసెంబర్లోనే అమల్లోకి రావడం కూడా సేల్స్కు మరింత బలం చేకూర్చింది. స్టాక్ కొరత రాకుండా వ్యాపారులు ముందుగానే పెద్ద ఎత్తున సరుకును లిఫ్ట్ చేయడం కనిపించింది.