పార్టీ ఏర్పాటు ముందు కవిత పలు వర్గాల అభిప్రాయాలు సేకరించారు. ఉద్యమకారులు, సామాజిక సంస్థలు, కుల సంఘాలు, నిపుణులతో చర్చలు జరిపి పార్టీ దిశను నిర్ణయించారు. రాజకీయ వ్యూహాలపై ప్రముఖ విశ్లేషకులతో కూడా సమాలోచనలు చేసినట్లు సమాచారం. ప్రజల నుంచి సేకరించిన ఫీడ్బ్యాక్ ఆధారంగా పార్టీ ఎజెండాను రూపొందించారు.
బహుజనాలపై దృష్టి
ఈ పార్టీ బహుజన వర్గాల సాధికారతపై దృష్టి పెట్టనుందని కవిత తెలిపారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడం, యువత, మహిళలకు పెద్దపీట వేయడం వంటి అంశాలు ఎజెండాలో భాగంగా ఉంటాయని చెప్పారు. ఇప్పటికే కొంతమంది మాజీ నాయకులు, కార్యకర్తలు ఈ పార్టీలో చేరినట్లు సమాచారం.