Hyderabad: కొన్నిసార్లు సినిమాల్లో కనిపించే సన్నివేశాలు చూస్తుంటే మనుషులు ఇంత కృరంగా ఉంటారా.? అని అనుకుంటాం. తాజాగా అచ్చంగా అలాంటి ఓ సంఘటన హైదరాబాద్లో జరిగింది. ఇటీవల వచ్చిన రాజు వెడ్స్ రాంబాయి సినిమాలో చూపించినట్లే నిజ జీవితంలో జరిగింది
హైదరాబాద్ నగర శివారులో ఓ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందనే కారణంతో ఓ యువకుడు యువతి జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నించాడు. ఆమెకు బలవంతంగా హెచ్ఐవీ సోకిన రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
24
పరిచయం నుంచి పెళ్లి చర్చల వరకు
పోలీసుల సమాచారం ప్రకారం, ఈ ఘటనలో నిందితుడు మనోహర్ అనే యువకుడు. అతడు తన బంధువుల్లోనే ఉన్న ఓ యువతిని ప్రేమిస్తున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిపాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి కుటుంబాల మధ్య పెళ్లి చర్చలు కూడా జరిగాయి. అయితే తరువాత అతనికి హెచ్ఐవీ ఉందనే విషయం బయటపడింది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే యువతి కుటుంబం పెళ్లిని రద్దు చేసింది. యువతి కూడా ఈ వివాహానికి స్పష్టంగా నిరాకరించింది.
34
నిరాకరణతో కక్ష పెంచుకున్న నిందితుడు
పెళ్లి తిరస్కరించడంతో మనోహర్ తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. తనను అవమానపరిచారని భావించి యువతిపై కక్ష పెంచుకున్నాడు. తనకు ఉన్న వ్యాధిని ఆమెకు కూడా సోకేలా చేసి ప్రతీకారం తీర్చుకోవాలని భావించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఆలోచనతోనే అతడు ముందుగా పథకం వేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 11వ తేదీన మనోహర్ యువతి ఇంటికి వెళ్లాడు. తనతో పెళ్లి చేసుకోవాలని మరోసారి ఒత్తిడి చేశాడు. యువతి మళ్లీ నిరాకరించడంతో అతడు క్రూరంగా ప్రవర్తించాడు. తనతో పాటు తీసుకువచ్చిన సిరంజితో బలవంతంగా ఇంజెక్షన్ ఇచ్చి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన తర్వాత యువతి కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది.
వైద్య పరీక్షల్లో బయటపడిన నిజం
ఈ ఘటన తర్వాత యువతికి జ్వరం, అస్వస్థత వంటి లక్షణాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమెకు HIV పాజిటివ్ అని గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత వెంటనే పోలీసులను ఆశ్రయించారు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కొద్ది సమయంలోనే నిందితుడు మనోహర్ను అదుపులోకి తీసుకున్నారు.