సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనుమానంగా క‌నిపించిన న‌లుగురు.. డౌట్ వ‌చ్చి బ్యాగులు చెక్ చేయ‌గా.!

Published : Apr 05, 2026, 09:44 AM IST

Hyderabad: పోలీసులు ఎన్ని చ‌ర్య‌లు చేప‌ట్టినా గంజాయి రవాణా మాత్రం ఆగ‌డం లేదు. ర‌క‌ర‌కాల మార్గాల్లో కేటుగాళ్లు గంజాయి స్మ‌గ్లింగ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌ను అధికారులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

PREV
13
అనుమానంగా క‌నిపించిన న‌లుగురు

శనివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురిపై పోలీసులకు అనుమానం కలిగింది. వారు స్టేషన్ సమీపంలో కొనుగోలుదారుని కోసం వేచి ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం వారిని అదుపులోకి తీసుకుని బ్యాగులను తనిఖీ చేసింది. పరిశీలనలో గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు తేలింది. వెంటనే నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

23
నాలుగు బ్యాగుల్లో 42.9 కిలోల గంజాయి

నిందితులు నాలుగు సంచుల్లో గంజాయిని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 20 ప్యాకెట్లలో ప్యాక్ చేసిన ఈ గంజాయి బరువు సుమారు 42.9 కిలోలుగా నిర్ధారించారు. దీని విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ డ్రగ్స్‌ను కొణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలులో తీసుకువచ్చినట్లు విచారణలో వెల్లడైంది.

33
ఏపీ నుంచి సేకరణ… ఇతర రాష్ట్రాలకు సరఫరా

ప్రాథమిక విచారణలో నిందితులు ఆంధ్రప్రదేశ్‌లోని తుని, నర్సీపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల నుంచి గంజాయిని సేకరించినట్లు తేలింది. అక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసి మహారాష్ట్రలోని ఔరంగాబాద్, ముంబై, పుణే వంటి నగరాల్లో అధిక ధరలకు విక్రయించాలనే యత్నం చేసినట్లు అధికారులు తెలిపారు. కిలో గంజాయిని సుమారు రూ.4 వేల నుంచి రూ.20 వేల వరకు విక్రయిస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారని చెప్పారు.

నలుగురు మహారాష్ట్రకు చెందిన నిందితులు

ఈ కేసులో అరెస్ట్ అయినవారు మహారాష్ట్రకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. నిందితులు గణేష్ శివనాథ్ బోడుగే (42), పరమేశ్వర్ దామోదర్ బాలప్ (33), విన్నీ శైలేష్ మేశారాం (32), ఖాన్ సజావర్ నవాజ్ ఖాన్ (54) గా ఉన్నారు. వీరిలో ప్రధాన నిందితుడి వద్ద నుంచి రూ.72,500 నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని సికింద్రాబాద్ ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.

Read more Photos on
click me!

Recommended Stories