డీలిమిటేష‌న్ అంటే ఏంటి? దీంతో ఏం జరుగుతుంది.? రేవంత్ రెడ్డి దీనిని ఎందుకు వ్య‌తిరేకిస్తున్నారు.?

Published : Apr 15, 2026, 04:01 PM IST

Delimitation: చెన్నైలో శనివారం జరగబోయే అఖిలపక్ష సమావేశం నేపథ్యంలో డీలిమిటేషన్ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో అస‌లు డీలిమిటేషన్ అంటే ఏంటి? గతంలో ఎలా అమలైంది? ఇప్పుడు ఎందుకు వివాదాస్పదంగా మారింది? వివరంగా చూద్దాం. 

PREV
15
డీలిమిటేషన్ అంటే ఏమిటి?

దేశంలో జనాభా మార్పులను పరిగణలోకి తీసుకుని లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను తిరిగి నిర్ణయించే ప్రక్రియనే డీలిమిటేషన్ అంటారు. ప్రతి ప్రాంతంలో జనాభా సమానంగా ఉండేలా సీట్లు కేటాయించడం దీని ప్రధాన లక్ష్యం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ సీట్లను కూడా ఈ ప్రక్రియలోనే నిర్ణయిస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 82, 170 ప్రకారం ప్రతి జనగణన తర్వాత ఈ ప్రక్రియ జ‌రుగుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే.. ప్రతి ఓటుకు సమాన విలువ ఉండేలా రాజకీయ ప్రాతినిధ్యాన్ని సర్దుబాటు చేయడమే డీలిమిటేషన్.

25
ఇప్పటివరకు ఎన్ని సార్లు జరిగింది?

భారతదేశంలో డీలిమిటేషన్ నాలుగు ప్రధాన దశల్లో జరిగింది:

* 1952 – మొదటి సార్వత్రిక ఎన్నికల ముందు (1951 జనాభా ఆధారం)

* 1963 – రెండోసారి సరిహద్దుల మార్పులు

* 1973 – సీట్ల సంఖ్య 545కు పెరిగింది

* 2002 – 2001 జనాభా ఆధారంగా సరిహద్దుల మార్పు (సీట్ల సంఖ్య మార్చలేదు)

అయితే 1976లో తీసుకొచ్చిన 42వ రాజ్యాంగ సవరణతో సీట్ల పెంపును తాత్కాలికంగా నిలిపివేశారు. తరువాత 84వ సవరణతో 2026 వరకు ఈ ఫ్రీజ్‌ను కొనసాగించారు.

35
సీట్ల పెంపు ఎందుకు నిలిచిపోయింది?

డీలిమిటేషన్ నిలిపివేయడానికి ప్రధాన కారణం జనాభా నియంత్రణకు ప్రోత్సాహం ఇవ్వడం. దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణలో ముందంజలో ఉన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా వేగంగా పెరిగింది. జనాభా ఆధారంగా సీట్లు పెంచితే అధిక జనాభా ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ ప్రాతినిధ్యం వస్తుంది. ఈ అసమానతను తగ్గించేందుకు 1971 జనాభా లెక్కల ఆధారంగానే సీట్లను స్థిరపరిచారు. అందుకే ప్రస్తుతం కూడా లోక్‌సభలో 543 సీట్లు కొనసాగుతున్నాయి.

45
కొత్త డీలిమిటేషన్‌తో ఏం మారుతుంది.?

2026 తర్వాత జరిగే డీలిమిటేషన్ దేశ రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశం ఉంది. అంచనాల ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో 80 నుంచి 128 సీట్లు, బీహార్‌లో 40 నుంచి 70 సీట్లు, తెలంగాణ‌లో 17 నుంచి 20 సీట్లు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 25 నుంచి 28కి పెరుగుతాయి. అలాగే త‌మిళ‌నాడులో 39గా ఉన్న సీట్ల సంఖ్య 41కి, కేర‌ళ‌లో 20 నుంచి 19కి త‌గ్గే అవ‌కాశం ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు భారీగా సీట్లు పెరుగుతాయి. జనాభా నియంత్రించిన రాష్ట్రాలకు తక్కువ లాభం లేదా నష్టం కూడా ఉండొచ్చు.

55
రేవంత్ రెడ్డి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధానంపై గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వాదన ప్రకారం జనాభా ఆధారంగా సీట్లు పెంచితే దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా బలహీనపడతాయి. కుటుంబ నియంత్రణ అమలు చేసిన రాష్ట్రాలకు ఇది శిక్షలా మారుతుంది. ఉత్తరాది రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యం పెరుగుతుంది. ప్రతి రాష్ట్రానికి 50% సీట్లు పెంచే ప్రతిపాదన వల్ల పెద్ద రాష్ట్రాలకే ఎక్కువ లాభం జ‌రుగుతుంద‌ని అంటున్నారు. ఉత్తర–దక్షిణ మధ్య అంతరం మరింత పెరుగుతుందని తెలిపారు. ఇందుకుగాను రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడ‌ల్స్‌ను ప్ర‌తిపాదించారు.

* మోడ‌ల్ 1 ప్ర‌కారం 50% సీట్లు – జీడీపీ, ఆర్థిక పనితీరు ఆధారంగా, 50% – జనాభా ఆధారంగా కేటాయించాలి.

* మోడల్ 2లో 40% జనాభా, 40% ఆర్థిక పనితీరు, 20% సమాఖ్య సమతుల్యత ఆధారంగా నిర్ణ‌యించాలి.

ఈ విధానంతో అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు న్యాయం, చిన్న రాష్ట్రాలకు రక్షణ, దేశ సమతుల్యత కాపాడే అవకాశం ఉంటుంద‌ని రేవంత్ రెడ్డి అభిప్రాయ‌ప‌డుతున్నారు.

మొత్తం మీద డీలిమిటేషన్ అనేది కేవలం సీట్ల పునర్విభజన మాత్రమే కాదు – దేశ రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే కీలక నిర్ణయం. జనాభా ఆధారంగా సీట్లు పెంచాలా? లేక అభివృద్ధి, ఆర్థిక పనితీరు కూడా పరిగణలోకి తీసుకోవాలా? అనే ప్రశ్నపై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాలు సమాన న్యాయం కోరుతుంటే, కేంద్రం సమగ్ర విధానం అవసరం అని చెబుతోంది. 2026 తర్వాత జరిగే డీలిమిటేషన్ ఈ వివాదానికి ఎలా తెర దించుతుందో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories