ఇవాళ (సెప్టెంబర్ 27న) ఆదిలాబాద్, కోమ్రంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
ఇక జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూండెం, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.