వాట్సప్ లో సరికొత్త సర్వీస్.. అమెజాన్ కి పోటీగా ముకేష్ అంబానీ.. వాటిని కూడా ఆర్డర్ చేయవచ్చు..

First Published Nov 30, 2021, 7:32 PM IST

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్  అమెజాన్ (Amazon.com Inc.), వాల్ మార్ట్ (Walmart Inc.)యాజమాన్యంలోని ఫ్లిప్ కార్ట్(flipkart) ఆధిపత్యాన్ని సవాలు చేస్తు బిలియనీర్ ముఖేష్ అంబానీ  యజమాన్యంలోని జియో మార్ట్ (JioMart) సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. 

ఇప్పుడు  "ట్యాప్ అండ్ చాట్" ఆప్షన్ ద్వారా కిరాణా సామాగ్రిని ఆర్డర్ చేయడానికి ఇప్పుడు వాట్సప్ప్ (WhatsApp)ని ఉపయోగించవచ్చు.

90 సెకన్ల ట్యుటోరియల్ అండ్ కేటలాగ్‌తో వాట్సప్ప్ షాపింగ్ ఇన్విటేషన్ పొందిన జియో మార్ట్ వినియోగదారుల ప్రకారం డెలివరీ ఉచితం ఇంకా మినిమమ్ ఆర్డర్ అలాంటివి లేవు. నిత్యవసరాలలో పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు, టూత్‌పేస్ట్, పనీర్ చీజ్, చిక్‌పీ ఫ్లోర్ వంటి కుకింగ్ సంబంధించిన వాటిలో కొనుగోలు చేయవచ్చు. కస్టమర్‌లు  షాపింగ్ చేసిన లేదా  కొనుగోలు చేసిన గ్రోసారిలను  జియో మార్ట్ ద్వారా లేదా నగదు రూపంలో చెల్లించవచ్చు.

గతంలో ఫేస్ బుక్ (Facebook Inc.)గా పిలవబడే  మెటా ఫ్లాట్ ఫర్మ్స్ (Meta Platforms Inc.) దాదాపు 6 బిలియన్లు రిలయన్స్ జియో ప్లాట్‌ఫారమ్‌ యూనిట్‌లో పెట్టుబడి పెట్టిన 19 నెలల తర్వాత ఈ చర్య వచ్చింది.  వాట్సప్ భారతదేశంలో దాదాపు 530 మిలియన్ల మంది వినియోగదారులను కలిగి ఉంది అంటే మెటా  అతిపెద్ద ఓవర్సీస్ బేస్, జియోకి 425 మిలియన్ల కంటే ఎక్కువ మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు.

బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ప్రకారం ఫుడ్ అండ్ గ్రోసారి సామాగ్రి దేశం  రిటైల్ వ్యయంలో సగానికి పైగా ఉంటుందని అంచనా వేసింది, అంటే 2025 నాటికి 1.3 ట్రిలియన్ల డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది.  ఆల్ఫబెట్ (Alphabet Inc.) గూగుల్ భాగస్వామ్యంతో రూపొందించిన స్మార్ట్‌ఫోన్‌ను జియో మార్ట్ అండ్ వాట్సప్ ప్రీలోడెడ్ యాప్‌లతో పరిచయం చేయడంతో అంబానీ గ్రూప్ మార్కెట్‌లో ఎక్కువ వాటాను పొందేందుకు తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. యూ‌ఎస్ భాగస్వాములు అండ్ పెట్టుబడిదారుల లాగానే గూగుల్ గత సంవత్సరం కంపెనీలో 4.5 బిలియన్ల డాలర్లను పెట్టుబడి పెట్టింది. 
 

రిలయన్స్, గూగుల్ వచ్చే వారం భారతదేశంలో ఒక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నాయి. మెటా  సిగ్నేచర్ మెసేజింగ్ సర్వీస్ రిలయన్స్ సహాయంతో భారతదేశంలో తన బ్రాండ్‌ను పునర్నిర్మిస్తోంది. అయితే దీనిపై మాట్లాడేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్, వాట్సాప్ ప్రతినిధులు స్పందించలేదు.

భారతీయ ఇ-కామర్స్‌ రంగంలో ప్రపంచ ప్రత్యర్థులు లాంచ్ అయిన సంవత్సరాల తర్వాత  గత వేసవిలో 200 నగరాల్లో రిలయన్స్ జియోమార్ట్‌తో పాటు వాట్సప్ గ్రోసారి ఆప్షన్ వచ్చింది. ఆన్‌లైన్ రిటైల్‌ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న సెగ్మెంట్ అయినప్పటికీ కిరాణా సామాగ్రి చిన్నగా మిగిలిపోయినందున ఇంకా చాలా అవకాశాలు మిగిలి ఉన్నాయి. అమెజాన్, వాల్‌మార్ట్‌తో పాటు సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్పోరేషన్-సపోర్ట్ తో గ్రోఫర్స్, గూగుల్-సపోర్ట్ తో డన్జో, నాస్పర్స్-సపోర్ట్ తో  స్విగ్గీ, టాటా కాంగ్లోమరేట్ ఇటీవల కొనుగోలు చేసిన బిగ్‌బాస్కెట్ అండ్ జెప్టో వంటి కొత్త ఎంట్రీలు వంటి దేశీయ స్టార్టప్‌లు గ్రోసరి డెలివరీ రంగాన్ని డిస్కౌంట్లు, ఇన్స్టంట్ డెలివరీలు పేరుతో ముంచెత్తుతున్నాయి. 
 

వాట్సాప్ షాపింగ్ ఫ్రంట్‌గా వినియోగదారులకు, రిటైలర్‌లకు సుపరిచితమైన ఎంట్రీ పాయింట్‌గా వాగ్దానం చేస్తుంది. కోట్లాది మంది భారతీయులు ఇప్పటికే సామాజిక, వృత్తిపరమైన, వినోద మార్గంగా రోజుకు ఎన్నో సార్లు దీనిని ఉపయోగిస్తున్నారు అలాగే షాపింగ్ చేయడానికి కొత్త యాప్‌ను డౌన్‌లోడ్ చేయడం లేదా నావిగేట్ చేయడం ఎలాగో నేర్చుకోవాల్సిన అవసరం లేదు.

 జియో, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ప్రతి ఒక్కటి  అవుట్‌లెట్‌లకు సహాయం చేయడానికి స్టోర్ మేనేజ్‌మెంట్ టెక్, క్రెడిట్ అండ్ టాక్స్ ఫైలింగ్ సేవలు, సప్లయి రీప్లెనిష్‌మెంట్‌తో  పోటీ పడుతున్నాయి.

click me!