శ్రావణ మాసంలో మగవారు, మహిళలు ఇద్దరు కూడా ఉపవాసాలు పాటిస్తారు. సోమవారాలు శివుని, మంగళవారాలు అమ్మవారిని, గురువారాలు గురుదేవుని, శుక్రవారాలు లక్ష్మీదేవిని భక్తితో ఆరాధిస్తారు. ఈ సమయంలో మాంసాహారంతో పాటు మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉంటారు.
శ్రావణ మాసం వచ్చింది అంటే చాలు... ప్రతిరోజూ ఉపవాసాలు, పూజలు, వ్రతాలు... అంతా ఎంతో ఆధ్యాత్మికతతో నిండిపోతుంది. దీన్ని పాటించటం వల్ల శరీరానికి డిటాక్సిఫికేషన్ జరుగుతుంది, మనసుకు ప్రశాంతత లభిస్తుంది.
అంటే శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినకూడదని చెప్పడం వెనుక గల కారణాలు కేవలం మతపరమైనవే కాదు. శాస్త్రీయ, వైద్యపరమైన, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి.