Chandra Grahan: ఈ ఏడాది తొలి చంద్రగ్రణం నేడు (మంగళవారం) ఏర్పడనుంది. పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడుతుండడం ఎంతో ప్రాముఖ్యత అని పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రహణానికి సంబంధించి ఉన్న కొన్ని ప్రశ్నలు, వాటి సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మంగళవారం సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించనుంది. మధ్యాహ్నం 3:21 గంటలకు ప్రారంభమై రాత్రి 7:52 వరకు కొనసాగుతుంది. భారతదేశంలో ఇది పాక్షికంగా కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో సూర్యాస్తమయం తర్వాత సాయంత్రం 6:20 నుంచి 6:47 వరకు దాదాపు 27 నిమిషాల పాటు చంద్రుడిపై గ్రహణ ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది.
25
ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు
గ్రహణాన్ని పురస్కరించుకుని అనేక దేవాలయాలను మూసివేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7:30 వరకు ఆలయ ద్వారాలు మూసివేస్తారు. రాత్రి 7:30కి తలుపులు తెరిచి శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. 8:30కి భక్తులకు దర్శనం ప్రారంభమవుతుంది. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉదయం 7 గంటల నుంచి మరుసటి రోజు వేకువజామున 3 వరకు ఆలయం మూసి ఉంటుంది. అనంతరం సంప్రోక్షణ పూజల తర్వాత భక్తులను అనుమతిస్తారు.
35
గ్రహణం సమయంలో శారీకంగా కలవొచ్చా?
భారతీయ సంస్కృతిలో గ్రహణాన్ని “సూతక కాలం”గా పరిగణిస్తారు. ఈ సమయంలో కొన్ని ఆచారాలు పాటిస్తారు. వీటిలో ప్రధానమైవని ఆహారం వండకూడదు, తినకూడదు అని నమ్మకం. గర్భిణీలు బయటకు వెళ్లకూడదని పెద్దలు సూచిస్తారు. మొక్కలు కోయడం, ఆకులు తెంపడంలాంటివి చేయకూడదని అంటారు. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి ఇంటిని శుభ్రపరచాలి. దానం, జపం, ప్రార్థనలు చేయడం మంచిదని భావిస్తారు.
ఇక గ్రహణ సమయంలో శారీరక కలయికకు దూరంగా ఉండాలని చెబుతుంటారు. ఆ సమయంలో గర్భం దాల్చితే పుట్టబోయే శిశువుపై ప్రభావం ఉంటుందని చెబుతారు. అందుకే ఒకవేళ శారీరకంగా కలిసినా గర్భం దాల్చకుండా జాగ్రత్త వహించాలని చెబుతున్నారు.
చంద్రగ్రహణం అనేది సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖలోకి వచ్చినప్పుడు భూమి నీడ చంద్రుడిపై పడటం వల్ల ఏర్పడే సహజ ఖగోళ ప్రక్రియ. ఇందులో ఎలాంటి అపశకునాలు లేదా ప్రతికూల శక్తులు ఉండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది పూర్తిగా ఒక ఖగోళ ప్రక్రియ మాత్రమే అని ఇందులో ఎలాంటి అపోహలు అవసరం లేదని శాస్త్రం చెబుతోంది.
55
గ్రహణ సమయంలో ఏం చేయాలి.?
ఓవైపు శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయాలు, మరోవైపు ఆధునిక శాస్త్రం. ఈ రెండింటి మధ్య చాలా మంది గందరగోళానికి గురవుతారు. గ్రహణ సమయంలో ఏం చేయాలి అన్నది వ్యక్తిగత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. సంప్రదాయాలను గౌరవించే వారు ఆచారాలు పాటిస్తే మనశ్శాంతి పొందవచ్చు. శాస్త్రీయ దృక్కోణాన్ని అనుసరించే వారు సాధారణ దినచర్యను కొనసాగించవచ్చు. అంతిమంగా మన నమ్మకాన్ని విశ్వసించి దానిని పాటించడం ఉత్తమం.