సివిల్స్ టాపర్ శక్తి దూబే సక్సెస్ స్టోరీ :
యూపిఎస్సి సివిల్ సర్విసెస్ ఎగ్జామినేషన్ 2024 తుది ఫలితాలు మంగళవారం (ఏప్రిల్ 22న) విడులయ్యాయి. ఇందులో మొత్తం 1,009 మంది సివిల్ సర్వెంట్స్ గా ఎంపికయ్యారు. ప్రిలిమినరీ, మెయిన్స్ తర్వాత 2,845 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలిచారు... వీరిలో వెయ్యిమందినే యూపిఎస్సి ఎంపికచేయింది. ఇందులో ఉత్తర ప్రదేశ్ కు చెందిన శక్తి దూబే ఆలిండియా టాపర్ గా నిలిచారు.
ప్రయాగరాజ్ ప్రాంతానికి చెందిన ఈమెకు యూపిఎస్సి ర్యాంక్ అంత ఈజీగా రాలేదు. దాదాపు ఎనిమిదేళ్లపాటు రాత్రనకా, పగలనకా కష్టపడి చదివితే ఆల్ ఇండియా టాపర్ గా నిలిచారు. తన కలను సాకారం చేసుకునేందుకు ఆమె చాలా ఓపికగా ఎదురుచూసారు... పట్టుదలతో అనుకున్నది సాధించారు.
ప్రాథమిక విద్యాభ్యాసం ప్రయాగరాజ్ లోనే పూర్తిచేసారు శక్తి దూబే. ఉన్నత విద్యాభ్యాసం మాత్రం బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి పూర్తిచేసారు. ఎంఎస్సి బయో కెమెస్ట్రీ పూర్తిచేసిన ఆమెకు మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. కానీ సివిల్ సర్వెంట్ మారి దేశానికి సేవ చేయాలనుకుని యూపిఎస్సి ప్రిపరేషన్ ప్రారంభించారు.
ఓవైపు యూపిఎస్సికి ప్రిపేర్ అవుతూనే మరోవైపు టీచింగ్ కొనసాగించారు. ఇలా తన లక్ష్యాన్ని చేరుకునేందుకే టీచింగ్ ను ఉపయోగించుకున్నారు... ఇలా వివిధ సబ్జెక్ట్స్ పై మరింత పట్టు సాధించారు శక్తి దూబే. కొంతకాలం తర్వాత టీచింగ్ ను వదిలేసి యూపిఎస్సి పై పూర్తి దృష్టి పెట్టారు.