ఉపాధి అవకాశాల పెంపు లక్ష్యంగా..
ఉపాధి అవకాశాల పెంపు లక్ష్యంగా బయో ఫార్మా రంగానికి రూ.10 వేల కోట్లు కేటాయిస్తూ, ఏపీ, ఒడిశా, తమిళనాడు, కేరళలో మైనింగ్ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా మూడు కెమికల్ రీసెర్చ్ పార్కులు, రెండు హైటెక్ టెక్నాలజీ హబ్స్, మూడు డెడికేటెడ్ కెమికల్ పార్కుల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. సెమీకండక్టర్ మిషన్కు రూ.40 వేల కోట్లు, కంటైనర్ తయారీ రంగానికి రూ.10 వేల కోట్లు కేటాయించారు. జౌళి రంగానికి ప్రోత్సాహం కల్పిస్తూ మెగా టెక్స్టైల్ పార్కులు, ఖాదీ, హ్యాండ్లూమ్, హస్తకళలకు ప్రత్యేక పథకాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఆత్మనిర్భర్ భారత్కు రూ.2 వేల కోట్లు, SME రంగానికి రూ.10 వేల కోట్లు, మైక్రో సెక్టార్కు రూ.2 వేల కోట్లు కేటాయిస్తూ బడ్జెట్ ద్వారా సమగ్ర ఆర్థిక బలోపేతమే లక్ష్యమని కేంద్రం స్పష్టంచేసింది.