పెట్రోల్, డీజిల్, గ్యాస్ దిగుమతులపై భారీగా ఖర్చు అవుతోందని పేర్కొన్నారు. అందుకే సముద్రంలో చమురు, గ్యాస్ అన్వేషణ కోసం ‘నేషనల్ దీప్వాటర్ ఎక్స్ప్లోరేషన్ మిషన్’ ప్రారంభిస్తారు. సౌరశక్తి, హైడ్రోజన్, హైడ్రోపవర్, అణుశక్తి విస్తరణకు కూడా ప్రాధాన్యం ఇస్తారు.
‘మేడ్ ఇన్ ఇండియా’ జెట్ ఇంజిన్
కోవిడ్ సమయంలో టీకాలు, UPI డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫాం తయారు చేసినట్లే, ఇప్పుడు మన ఫైటర్ జెట్ల కోసం మనమే జెట్ ఇంజిన్ తయారు చేయాలి అని మోదీ పిలుపునిచ్చారు. ఇది శాస్త్రవేత్తలు, యువతకు సవాలుగా విసిరారు.