PM Modi: ఆ వీడియోలు మోదీ మాట్లాడినవి కావు.. వైరల్ వీడియోలపై క్లారిటీ

Published : Jul 25, 2026, 02:20 PM ISTUpdated : Jul 25, 2026, 02:21 PM IST

PM Modi: దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలపై కేంద్ర ప్రభుత్వం కీలక స్పష్టత ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు మాట్లాడినట్లు కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. 

PREV
13
ఏఐతో మార్ఫింగ్ చేసిన వీడియోలు..

వైరల్ అవుతున్న వీడియోల్లో ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులను హెచ్చరిస్తున్నట్లు, కేంద్ర మంత్రులు ఆందోళనకారులపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నట్లు చూపిస్తున్నారు. అయితే ఈ వీడియోల్లోని ఆడియో, విజువల్స్‌ను ఏఐ టెక్నాలజీతో మార్ఫింగ్ చేసినట్లు పీఐబీ తెలిపింది. ప్రత్యేకంగా ప్రశ్నపత్రాల లీకేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ ఇటీవల విడుదల చేసిన వీడియోలోని దృశ్యాలను, పార్లమెంట్ వెలుపల కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడిన అసలు వీడియోను మార్చి తప్పుడు సందేశంతో ప్రచారం చేస్తున్నట్లు గుర్తించింది. ఈ వీడియోల్లో వినిపిస్తున్న మాటలు అసలు ప్రసంగాల్లో లేవని స్పష్టం చేసింది.

23
విదేశీ నెట్‌వర్క్‌ల పాత్రపై కేంద్రం అప్రమత్తం

ఈ తప్పుడు వీడియోల వ్యాప్తి వెనుక విదేశీ సోషల్ మీడియా నెట్‌వర్క్‌లు కూడా పనిచేస్తున్నాయని పీఐబీ తెలిపింది. ముఖ్యంగా పాకిస్థాన్‌కు చెందిన కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ ఈ వీడియోలను పెద్దఎత్తున షేర్ చేస్తూ తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నట్లు వెల్లడించింది. దేశంలో జరుగుతున్న ఆందోళనలను అవకాశంగా మార్చుకుని ప్రజల్లో గందరగోళం సృష్టించడం, ప్రభుత్వంపై అపోహలు కలిగించడం లక్ష్యంగా ఈ తరహా ఏఐ వీడియోలు వ్యాప్తి చేస్తున్నారని అధికారులు హెచ్చరించారు. అందువల్ల సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వీడియోను వెంటనే నమ్మకుండా, అధికారిక వనరుల ద్వారా నిజానిజాలు తెలుసుకోవాలని సూచించారు.

33
ఫేక్ కంటెంట్ కనిపిస్తే ఇలా ఫిర్యాదు చేయండి

కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనుమానాస్పద వీడియోలు, ఫోటోలు లేదా సందేశాలు కనిపిస్తే వెంటనే PIB Fact Checkకు సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం కోరుతోంది. ఫిర్యాదు చేయడానికి 91 8799711259 వాట్సాప్ నెంబ‌ర్‌, factcheck@pib.gov.in ఇమెయిల్ ఐడీల‌ను ఇచ్చారు. అలాగే ఏఐ సాయంతో రూపొందించిన వీడియోలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని ధృవీకరించిన తర్వాతే ఇతరులతో పంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవడంలో ప్రతి పౌరుడి బాధ్యత కూడా ఎంతో ముఖ్యమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

Read more Photos on
click me!

Recommended Stories