వివరాలు తెలుసుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని, గత చరిత్ర, ప్రయాణ వివరాలు, వలస నిబంధనలు, పెళ్లి చట్టబద్ధత గురించి విచారిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కాదు. 2022లో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది.
అప్పట్లో మొహమ్మద్ ఫయిజ్ అనే పాకిస్తాన్ వ్యక్తి నేపాల్ మార్గంగా అక్రమంగా భారత్లోకి వచ్చి, హైదరాబాద్లో ఓ యువతిని పెళ్లి చేసుకుని, ఆమె కుటుంబ సహకారంతో ఆధార్ కార్డు పొందాడు. ఇది అప్పట్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.