దక్షిణ వజీరిస్తాన్లో భారీ దాడి 20 మంది పాక్ సైనికులు మృతి:
గురువారం రాత్రి దక్షిణ వజీరిస్తాన్లోని షాకై ప్రాంతంలోని డాంగేట్ అవుట్పోస్ట్పై TTP తీవ్రదాడికి దిగింది. మొదట లేజర్ రైఫిళ్లతో 6 మంది సైనికులను చంపిన తర్వాత, ఆ అవుట్పోస్ట్కు మద్దతుగా వచ్చిన సైనిక కాన్వాయ్పై ఎంబుష్ చేసి మొత్తం 20 మంది పాక్ సైనికులను హతమార్చినట్టు TTP ప్రకటించింది. ఈ దాడిలో ఐదుగురు గాయపడ్డారు.
TTP వెల్లడించిన ప్రకారం, ఇది ఒక బహుఫేజ్ దాడిగా, షావాల్లో పాక్ సైన్యం జరిపిన దాడికి ప్రతీకారంగా జరిగింది. వారు రాకెట్ లాంచర్లు, నైట్ విజన్ గేర్ వంటి ఆధునిక ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు.