భారతీయ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్ పొందిన పాక్ విద్యార్థుల పరిస్థితేంటి?
పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ సంబంధాలు మరింత దిగజారాయి. ఈ ఘటన తర్వాత పాకిస్థాన్ పై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ పెరిగింది.. దీంతో మోదీ సర్కార్ కూడా ఆ దిశగానే నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే పాకిస్థాన్ వీసాలను రద్దు చేసారు... వెంటనే ఆ దేశస్తులు భారత్ ను వీడాలని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రతి ఏటా భారతీయ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్ పొందే పాకిస్థానీ విద్యార్థుల భవిష్యత్తు ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది.
ప్రతి సంవత్సరం బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, టాంజానియా వంటి దేశాల నుండి వేలాది మంది విద్యార్థులు భారతీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందుతారు. వీరిలో పాకిస్థాన్ విద్యార్థులు కూడా ఉన్నారు. వీరు వైద్య, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, న్యాయశాస్త్రం వంటి కోర్సుల్లో చదువుకోవడానికి భారత్కు వస్తారు. అయితే ఇకపై పాకిస్థానీ విద్యార్థులకు భారతీయ వీసా పొందడం చాలా కష్టం.