Operation Sindoor: ఈ దెబ్బను శత్రువులు ఎప్పటికీ మరిచిపోలేరు.. ఇండియన్ ఆర్మీ దాడిపై ప్రముఖుల రియాక్ష‌న్స్

Published : May 07, 2025, 05:25 AM ISTUpdated : May 07, 2025, 05:27 AM IST

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌కి దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. పలు రంగాల ప్రముఖులు, రాజకీయ నాయకులు సామాజిక మాధ్యమాల్లో స్పందిస్తూ భారత సైన్యానికి మద్దతు తెలిపారు.  

PREV
17
Operation Sindoor: ఈ దెబ్బను శత్రువులు ఎప్పటికీ మరిచిపోలేరు.. ఇండియన్ ఆర్మీ దాడిపై ప్రముఖుల రియాక్ష‌న్స్
Operation Sindoor

భారత రక్షణ శాఖ ఈ ఆపరేషన్‌పై అధికారిక ప్రకటన చేసిన వెంటనే, రక్షణ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ "భారత్ మాతా కీ జై" అని నినదించింది. ఈ పోస్ట్ ద్వారా భారత సైన్య ధైర్యాన్ని, దేశభక్తిని హైలైట్ చేశారు.
 

27
Operation sindoor

కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా ఆపరేషన్ సింధూర్‌కు మద్దతు తెలిపారు. "ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ ప్రకారం ఉగ్రవాదం పైన గట్టి చర్యలు తీసుకుంటున్నాం. పహల్గాం ఉగ్రదాడికి న్యాయం జరిగేలా చర్యలు కొనసాగుతున్నాయి. మోదీ పాలనలో దేశ భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఉంటుంది. ఈ దెబ్బను శత్రువులు ఎప్పటికీ మరిచిపోలేరు" అని వ్యాఖ్యానించారు.

37
Operation sindoor

ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు సద్గురు కూడా భారత సైన్య విజయాన్ని ఆకాంక్షిస్తూ స్పందించారు. "మన దళాలు సురక్షితంగా ఉండాలని, విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని ట్వీట్‌ చేశారు.

47
Operation sindoor

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తన ట్వీట్‌లో “భారత్ మాతా కీ జై” అంటూ  స్పందించారు. అంతేకాక, “హరహర మహాదేవ్” అంటూ పోస్ట్‌ చేసి భారత సంస్కృతి, శౌర్యాన్ని గుర్తు చేశారు.

57
Operation sindoor

భారత రక్షణ శాఖ ఈ ఆపరేషన్‌పై అధికారిక ప్రకటన చేసిన వెంటనే, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ "భారత్ మాతా కీ జై" అని ట్వీట్ చేశారు. ఈ పోస్ట్ ద్వారా భారత సైన్య ధైర్యాన్ని, దేశభక్తిని హైలైట్ చేశారు.

67
Operation sindoor

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కూడా భారత సైన్యపు ప్రకటనను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ "జై హింద్" అంటూ దేశభక్తిని వ్యక్తం చేశారు. భారత దళాలు చేసిన ధైర్యవంతమైన చర్యపై తమ మద్దతు తెలిపిన తొలి ముఖ్యమంత్రి కావడం విశేషం.

77

సామాజిక మాధ్యమాల్లో "భారత్ మాతా కీ జై", "జై హింద్" అనే హ్యాష్‌ట్యాగ్‌లు విస్తృతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ చర్యలన్నీ పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయానికి చిహ్నంగా కనిపిస్తున్నాయి. 

Read more Photos on
click me!

Recommended Stories