రాత్రివేళల్లోనే పోస్టుమార్టం ఎందుకు చేశారని రాజకీయ వర్గాలు ప్రశ్నించాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ, 2021 కేంద్ర మార్గదర్శకాలు ప్రకారం సాయంత్రం తర్వాత కూడా శవపరీక్షలు నిర్వహించవచ్చని తెలిపింది.
మహిళలు, పిల్లలే ఎక్కువ
మృతులలో 18మంది మహిళలు, 13మంది పురుషులు, 10మంది చిన్నారులు ఉన్నట్లు వైద్య విభాగం తెలిపింది. ప్రస్తుతం 59మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు, వీరిలో ఇద్దరు ఐసీయూలో ఉన్నారు.
తొలి అరెస్ట్
ఇదిలా ఉంటే తొక్కిసలాట ఘటనలో తొలి అరెస్ట్ జరిగింది. టీవీకే జిల్లా సెక్రటరీ మతియఝగన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన నేతల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తొక్కిసలాటకు సంబంధించి రిటైర్డ్ జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలోని ఏక సభ్య కమిషన్ విచారణను వేగవంతం చేసింది. మరణించిన 41 మంది కుటుంబాలను కలిసి వారివద్ద వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.