
దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే భక్తుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక అదిరిపోయే టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. 'సౌత్ ఇండియా టెంపుల్ రన్' (South India Temple Run) పేరుతో ఈ ప్రత్యేక ఫ్లైట్ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.
హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ జర్నీ స్టార్ట్ అవుతుంది. కేరళ, తమిళనాడులోని మోస్ట్ పాపులర్ టెంపుల్స్ చూసేందుకు ఇదొక బెస్ట్ ఛాన్స్. ఈ ప్యాకేజీ కోడ్ 'SHA23'. కంఫర్ట్ క్లాస్ కేటగిరీలో ఈ ట్రిప్ ప్లాన్ చేశారు. 2026 ఆగస్టు 16న హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్రారంభం కానుంది. మొత్తం 6 రాత్రులు, 7 రోజుల పాటు సాగే ఈ డివైన్ జర్నీలో ఏమేం చూడొచ్చు, ఖర్చులు ఎంత అనే ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం.
ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా భక్తులు విమానంలో ప్రయాణిస్తారు. ఆగస్టు 16న ఉదయం 06:10 గంటలకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇండిగో ఫ్లైట్ బయలుదేరుతుంది. ఉదయం 07:55 గంటలకు తిరువనంతపురం చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో ఆగస్టు 22న సాయంత్రం 17:10 గంటలకు మదురై ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ ఎక్కితే, రాత్రి 18:45 గంటలకు హైదరాబాద్ ల్యాండ్ అవుతారు. మొత్తం గ్రూప్ సైజ్ 29 మంది మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రయాణం చాలా కంఫర్టబుల్గా సాగుతుంది.
ఈ టూర్ ప్యాకేజీలో మీరు సెలెక్ట్ చేసుకునే ఆక్యుపెన్సీని బట్టి రేట్లు మారుతుంటాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
• సింగిల్ ఆక్యుపెన్సీ (ఒక్కరే రూమ్ తీసుకుంటే): రూ. 52,550/-
• ఇద్దరు కలిసి షేర్ చేసుకుంటే: రూ. 39,850/-
• ముగ్గురు షేర్ చేసుకుంటే: రూ. 37,700/-
• పిల్లలు (5-11 ఏళ్లు, ఎక్స్ట్రా బెడ్తో): రూ. 33,000/-
• పిల్లలు (5-11 ఏళ్లు, బెడ్ లేకుండా): రూ. 28,700/-
• చిన్నపిల్లలు (2-4 ఏళ్లు, బెడ్ లేకుండా): రూ. 21,400/-
ప్యాకేజీలో కలిపి ఉన్నవి..
హైదరాబాద్ టు త్రివేండ్రం, మదురై టు హైదరాబాద్ ఎకానమీ క్లాస్ ఎయిర్ టికెట్లు ఉంటాయి. హోటల్ వసతి (1 నైట్ త్రివేండ్రం, 1 నైట్ కన్యాకుమారి, 2 నైట్స్ రామేశ్వరం, 1 నైట్ త్రిచి, 1 నైట్ మదురై) లభిస్తుంది. 7 బ్రేక్ఫాస్ట్లు, 6 డిన్నర్లు ప్యాకేజీలోనే ఇస్తారు. ఐటీనరరీ ప్రకారం సైట్సీయింగ్ కోసం ఏసీ బస్సు అరేంజ్ చేస్తారు.
ట్రావెల్ ఇన్సూరెన్స్, ఐఆర్సీటీసీ టూర్ ఎస్కార్ట్ సర్వీసెస్, అన్ని రకాల ట్యాక్సులు ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. త్రివేండ్రంలో కేటీడీసీ చైత్రం లేదా సిమిలర్, కన్యాకుమారిలో విశ్వ గ్రాండ్, రామేశ్వరంలో హోటల్ వినాయక, త్రిచిలో బ్రీజ్ రెసిడెన్సీ, మదురైలో టీటీడీసీ యూనిట్ 2 లేదా వాటికి సమానమైన హోటళ్లలో వసతి కల్పిస్తారు. మిగతా ఖర్చులు సొంతంగా పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఈ టూర్ బుక్ చేసుకునే వారు కొన్ని రూల్స్ గుర్తుంచుకోవాలి. 75 ఏళ్లు పైబడిన వారు కచ్చితంగా ఒక యంగ్ ఫ్యామిలీ మెంబర్ లేదా ఎస్కార్ట్తో రావాలి. ఇది గ్రూప్ టూర్ కాబట్టి పర్సనల్ సర్వీసెస్ కుదరవు, గ్రూప్తో కలిసి నడుచుకోవాలి. ఎయిర్పోర్ట్కు ఫ్లైట్ టైమ్ కంటే 2 గంటల ముందే రీచ్ అవ్వాలి. లో కాస్ట్ క్యారియర్ ఫ్లైట్లలో ఫుడ్ ఛార్జబుల్ ఉంటుంది. హోటల్ చెకిన్ టైమ్ మధ్యాహ్నం 14:00 గంటలు, చెకౌట్ టైమ్ ఉదయం 11:00 గంటలు. ట్రిపుల్ షేరింగ్ తీసుకుంటే డబుల్ బెడ్ రూమ్తో పాటు ఫ్లోర్పై ఎక్స్ట్రా మ్యాట్రెస్ ఇస్తారు.
ట్రిప్ ప్రారంభానికి 21 రోజుల ముందు క్యాన్సిల్ చేస్తే ప్యాకేజీ కాస్ట్లో 30% కట్ అవుతుంది. 15 నుండి 21 రోజుల ముందు క్యాన్సిల్ చేస్తే 55% డిడక్ట్ అవుతుంది. 8 నుండి 14 రోజుల ముందు క్యాన్సిల్ చేస్తే 80% డిడక్ట్ అవుతుంది. 7 రోజులు లేదా అంతకంటే తక్కువ టైమ్ ఉండి క్యాన్సిల్ చేస్తే లేదా రాకపోతే 100% అమౌంట్ కట్ అవుతుంది, పైసా తిరిగి రాదు.
బుకింగ్స్ కోసం ఐఆర్సీటీసీ సౌత్ సెంట్రల్ జోన్, 3వ ఫ్లోర్, ఆక్స్ఫర్డ్ ప్లాజా, ఎస్.డి. రోడ్, సికింద్రాబాద్, తెలంగాణ ఆఫీస్ను సంప్రదించవచ్చు. లేదా మొబైల్ నంబర్: 8287932229, ఈమెయిల్: bsashidhar5605@irctc.com ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. విజయవాడ రైల్వే స్టేషన్ (9281030714), తిరుపతి రైల్వే స్టేషన్ (9281495853) ఇన్ఫర్మేషన్ సెంటర్లలోనూ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు.