IRCTC Char Dham Yatra: ఐఆర్సీటీసీ అదిరిపోయే చార్ ధామ్ యాత్ర ప్యాకేజీని అందిస్తోంది. ఈ సూపర్ ప్యాకేజీ యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ వంటి క్షేత్రాలను కూడా సందర్శించవచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
భారతదేశంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలను సందర్శించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా ఉత్తరాఖండ్లోని దేవభూమిలో ఉన్న చార్ ధామ్ క్షేత్రాలను దర్శించుకోవడం జీవిత కాల స్వప్నంగా భావిస్తారు. భక్తుల కలలను నిజం చేస్తూ, ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) టూరిజం ఒక అద్భుతమైన చార్ ధామ్ యాత్ర ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. చాలా తక్కువ బడ్జెట్లోనే, ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఆధ్యాత్మిక యాత్రను పూర్తి చేసుకునేలా ఐఆర్సీటీసీ ఈ టూర్ను ప్లాన్ చేసింది.
26
చార్ ధామ్ విశేషాలు ఇవే.. ఎక్కడి నుంచి మొదలవుతుందంటే?
ఈ ప్యాకేజీలో హిమాలయాల్లోని నాలుగు అత్యంత పవిత్రమైన క్షేత్రాలను దర్శించుకోవచ్చు. హిందూ సాంప్రదాయం ప్రకారం, చార్ ధామ్ యాత్రను క్లాక్వైజ్ అంటే ప్రదక్షిణ దిశలో పూర్తి చేయాల్సి ఉంటుంది.
• యమునోత్రి: హిమాలయాల్లో ఉన్న ఈ పవిత్ర క్షేత్రం నుంచే చార్ ధామ్ యాత్ర అధికారికంగా ప్రారంభమవుతుంది. ఇక్కడి యమునోత్రి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది.
• గంగోత్రి: గంగా దేవి కొలువైన ఈ క్షేత్రం ఉత్తర భారతదేశంలోనే అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఆధ్యాత్మికతతో పాటు ఇక్కడి ప్రకృతి అందాలు పర్యాటకులను కట్టిపడేస్తాయి.
• కేదార్నాథ్: గార్వాల్ హిమాలయాల్లో శివుడు కొలువైన పరమ పవిత్ర క్షేత్రం. ప్రశాంతమైన వాతావరణం, అద్భుతమైన కొండల మధ్య ఉండే ఈ ఆలయాన్ని ఐఆర్సీటీసీ ప్యాకేజీలో ప్రత్యేకంగా సందర్శించవచ్చు.
• బద్రీనాథ్: ఆది శంకరాచార్యుల వారు స్థాపించిన ఈ ఆలయంలో మహావిష్ణువు కోలువై ఉన్నారు. గార్వాల్ కొండల్లో ఉన్న ఈ క్షేత్ర దర్శనంతో యాత్ర ముగుస్తుంది.
36
ప్యాకేజీ ధర, ప్రయాణ వివరాలు
ఐఆర్సీటీసీ అందిస్తున్న ఈ ప్యాకేజీ ఢిల్లీ లేదా హరిద్వార్ వంటి ప్రధాన ప్రాంతాల నుండి ప్రారంభమవుతుంది. ఈ టూర్ మొత్తం 11 నుండి 12 రోజుల పాటు సాగుతుంది. ఇందులో బడ్జెట్ కు అనుగుణంగా విధిధ రకాల ప్లాన్స్ ఉన్నాయి. ఈ ప్రయాణం పూర్తిగా రోడ్డు మార్గం ద్వారానే సాగుతుంది. కొండ ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా ఏసీ లేదా నాన్ ఏసీ వాహనాల్లో గ్రూప్ టూర్గా ప్రయాణికులను తీసుకెళ్తారు. బడ్జెట్ నుండి లగ్జరీ వరకు కస్టమర్ల ఛాయిస్ ప్రకారం హోటల్ రూమ్స్ అందుబాటులో ఉంటాయి.
బుకింగ్ చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన టిప్స్
ఈ యాత్రకు వెళ్లాలనుకునే వారు కొన్ని రూల్స్ కచ్చితంగా పాటించాలి. మీరు ఐఆర్సీటీసీ ద్వారా బుక్ చేసుకున్నప్పటికీ, ఉత్తరాఖండ్ టూరిజం అధికారిక పోర్టల్లో ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. చార్ ధామ్ యాత్ర సాధారణంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ మధ్యలో ప్రారంభమై, శీతాకాలం కంటే ముందే ముగుస్తుంది. ప్రస్తుతం ఇప్పటికే స్టార్ అయింది.
ఈ టూర్ చాలా కష్టమైన కొండ ప్రాంతాల్లో, ఎక్కువ ఎత్తులో సాగుతుంది. అందుకే 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్న పిల్లలను ఈ యాత్రకు తీసుకురావద్దని ఐఆర్సీటీసీ సూచిస్తోంది. అలాగే, కేదార్నాథ్ వెళ్లడానికి హెలికాప్టర్ సర్వీస్ కావాలనుకుంటే, దాన్ని ప్యాకేజీ కాకుండా విడిగా బుక్ చేసుకుని సొంతంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
66
బుకింగ్ ప్రాసెస్ ఏమిటి?
చార్ ధామ్ పుణ్యక్షేత్రాలను సందర్శించడానికి ఐఆర్సీటీసీ టూరిజం అత్యంత నమ్మకమైన పార్ట్నర్గా నిలుస్తుంది. మీరు కూడా ఈ పవిత్ర యాత్రను ప్లాన్ చేయాలనుకుంటే ఆలస్యం చేయకుండా ఐఆర్సీటీసీ టూరిజం అధికారిక వెబ్సైట్ www.irctctourism.com లేదా వారి అఫీషియల్ మొబైల్ యాప్ని విజిట్ చేయవచ్చు. అక్కడ మీ బడ్జెట్కు సరిపోయే ప్యాకేజీని సెలెక్ట్ చేసుకుని ఈజీగా బుకింగ్ పూర్తి చేసుకోవచ్చు. మీ ఫ్యామిలీతో కలిసి హిమాలయాల అందాల మధ్య ఆధ్యాత్మిక యాత్రను చేయాలనుకుంటే ఇప్పటికే మొదలైన చార్ ధామ్ యాత్ర సీట్లను రిజర్వ్ చేసుకోండి.