ముంబై విమానాశ్రయం ఇప్పటికే కెపాసిటీ సమస్యలతో ఉండగా, ఇండిగో రద్దులు మరింత ఒత్తిడిని పెంచాయి.
దీంతో, కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి మధుసూదన్ శంకర్ ముంబై ఎయిర్పోర్ట్లో నేరుగా పరిశీలనలు చేసి ఇండిగో అధికారుల నుంచి వివరణ కోరారు. ప్రభుత్వం విమానాశ్రయాలకు కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చింది:
* ప్రయాణికులకు తాగునీరు, ఆహారం, సీటింగ్ ఏర్పాటు తప్పనిసరి
* వైద్య సహాయం, PRM సపోర్ట్ మెరుగుపరచాలి
* CISF సహకారాన్ని మంత్రిత్వ శాఖ ప్రశంసించింది
అదేవిధంగా, కోల్కతా విమానాశ్రయంలో కూడా కార్యకలాపాల నిర్వహణ, బ్యాగేజ్ హ్యాండ్లింగ్, రద్దుల నిర్వహణపై పూర్తి స్థాయి పరిశీలన చేపట్టింది MoCA టీమ్.