Indian Railways: భారత్ నుంచి విదేశాలకు రైళ్లు వెళ్తాయా.? ఇవి ఎక్కాలంటే వీసా కావాలా.?

Published : Oct 06, 2025, 10:59 AM IST

Indian Railways: భార‌త్ నుంచి అంత‌ర్జాతీయ ప్ర‌యాణాలు చేయ‌డానికి ఎక్కువ‌గా విమానాలను ఉప‌యోగిస్తుంటామ‌ని తెలిసిందే. అయితే భార‌త్ నుంచి కొన్ని దేశాల‌కు రైలు మార్గం కూడా అందుబాటులో ఉంద‌ని మీకు తెలుసా.? ఇంత‌కీ ఆ రూట్లు ఏవంటే.? 

PREV
15
నేపాల్‌కు రైలు ప్రయాణం

భారతదేశం, నేపాల్ మధ్య రైలు సర్వీసులు చాలాకాలంగా నడుస్తున్నాయి.

* బీహార్‌లోని జయనగర్ స్టేషన్ నుంచి నేరుగా నేపాల్‌లోని జనక్‌పూర్ కుర్తా స్టేషన్‌ వరకు రైలు వెళ్తుంది.

* రాక్సౌల్ జంక్షన్ కూడా నేపాల్ ప్రవేశానికి కీలక ద్వారం.

* ఈ మార్గాల్లో ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణిస్తారు.

* ముఖ్యంగా, భారతీయులకు నేపాల్‌కు వెళ్ల‌డానికి పాస్‌పోర్ట్ లేదా వీసా అవసరం లేదు. ప్రయాణికులు ఫోటో ఐడీ కార్డు చూపిస్తే సరిపోతుంది.

25
బంగ్లాదేశ్‌కు రైలు కనెక్టివిటీ

భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య రెండు రైళ్లు న‌డుస్తున్నాయి.

మైత్రీ ఎక్స్‌ప్రెస్: కోల్‌కతా – ఢాకా మధ్య వారానికి ఆరు రోజులు నడుస్తుంది. దాదాపు 375 కిలోమీటర్ల దూరాన్ని తొమ్మిది గంటల్లో కవర్ చేస్తుంది.

బంధన్ ఎక్స్‌ప్రెస్: కోల్‌కతా – ఖుల్నా మధ్య వారానికి ఒకసారి నడుస్తుంది. అయితే, బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతల కారణంగా ప్రస్తుతం ఈ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. సాధారణంగా ఈ ప్రయాణానికి వీసా తప్పనిసరి.

35
పాకిస్తాన్‌కి కూడా..

ఒకప్పుడు భారతదేశం – పాకిస్తాన్ మధ్య రెండు ముఖ్యమైన రైళ్లు నడిచేవి.

సమ్జౌతా ఎక్స్‌ప్రెస్: ఢిల్లీ – అట్టారి నుంచి లాహోర్ వరకు ఈ రైలు అందుబాటులో ఉండేది.

థార్ లింక్ ఎక్స్‌ప్రెస్: జోధ్‌పూర్ నుంచి కరాచీ వరకు కూడా ఒక రైలు సర్వీస్ ఉండేది.

అయితే 2019లో భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు క్షీణించడంతో ఈ రెండు రైలు సర్వీసులను నిలిపివేశారు.

45
భూటాన్‌కు మొదటిసారిగా రైలు ప్రాజెక్టు

భూటాన్ ఇప్పటివరకు భారత రైలు నెట్‌వర్క్‌లో లేని దేశం. కానీ, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రెండు ప్రధాన రైలు ప్రాజెక్టులను ఆమోదించింది.

కోక్రాఝర్ (అస్సాం) – గెలెఫు (భూటాన్) : 69 కిలోమీటర్ల ప్ర‌యాణం ఉంటుంది.

బనార్హట్ (పశ్చిమ బెంగాల్) – సామ్త్సే (భూటాన్): 20 కిలోమీటర్లు ప్ర‌యాణించాల్సి ఉంటుంది.

ఈ మార్గాల్లో ప్యాసింజర్, స‌రుకు రవాణా రైళ్లు నడుస్తాయి. ఇది భూటాన్‌తో మొదటిసారిగా ప్రత్యక్ష రైలు కనెక్టివిటీ అవుతుంది.

55
భవిష్యత్తులో కొత్త దేశాలతో కనెక్టివిటీ

భారత రైల్వేలు రాబోయే రోజుల్లో మరికొన్ని దేశాలతో రైలు సర్వీసులు ప్రారంభించే ప్రణాళికలు చేస్తున్నాయి. వీటిలో ప్ర‌ధానంగా..

* మణిపూర్ నుంచి మయన్మార్, వియత్నాం వరకు రైలు మార్గం ప్రతిపాదించారు.

* న్యూఢిల్లీ నుంచి చైనాలోని కున్మింగ్ వరకు హై-స్పీడ్ రైలు ప్రాజెక్ట్ గురించి చర్చలు జరిగాయి. ఇది కార్య‌రూపం దాల్చితే గూడ్స్ ర‌వాణా మ‌రింత మెరుగ‌వుతుంది.

* థాయిలాండ్, మలేషియా, సింగపూర్‌లతో రైలు కనెక్టివిటీపై పరిశీలనలు జరుగుతున్నాయి. ఒక‌వేళ ఈ మార్గాలు అందుబాటులోకి వ‌స్తే ప్ర‌యాణ ఖ‌ర్చు త‌గ్గుతుంది. అయితే వీటికి పాస్‌పోర్ట్, వీసా త‌ప్ప‌నిస‌రి చేస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories