భారత రైల్వేలు రాబోయే రోజుల్లో మరికొన్ని దేశాలతో రైలు సర్వీసులు ప్రారంభించే ప్రణాళికలు చేస్తున్నాయి. వీటిలో ప్రధానంగా..
* మణిపూర్ నుంచి మయన్మార్, వియత్నాం వరకు రైలు మార్గం ప్రతిపాదించారు.
* న్యూఢిల్లీ నుంచి చైనాలోని కున్మింగ్ వరకు హై-స్పీడ్ రైలు ప్రాజెక్ట్ గురించి చర్చలు జరిగాయి. ఇది కార్యరూపం దాల్చితే గూడ్స్ రవాణా మరింత మెరుగవుతుంది.
* థాయిలాండ్, మలేషియా, సింగపూర్లతో రైలు కనెక్టివిటీపై పరిశీలనలు జరుగుతున్నాయి. ఒకవేళ ఈ మార్గాలు అందుబాటులోకి వస్తే ప్రయాణ ఖర్చు తగ్గుతుంది. అయితే వీటికి పాస్పోర్ట్, వీసా తప్పనిసరి చేస్తారు.