అసెంబ్లీ ఎన్నికలతో పాటే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.
• ఉప ఎన్నికల తేదీ: ఏప్రిల్ 9 (గురువారం).
• నోటిఫికేషన్: మార్చి 16.
• నామినేషన్ల గడువు: మార్చి 23.
• స్క్రూటినీ: మార్చి 24.
• ఉపసంహరణ: మార్చి 26.
ఈ ఉప ఎన్నికల ఫలితాలు కూడా మే 4నే వెలువడనున్నాయి.
17.4 కోట్ల ఓటర్లు.. పక్కా భద్రత
మొత్తం 17.4 కోట్ల మంది ఓటర్లు ఈ భారీ ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నారు. సుమారు 2.19 లక్షల పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా, 25 లక్షల మంది సిబ్బంది విధుల్లో ఉంటారు. పారదర్శకత కోసం ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వెబ్ కాస్టింగ్, కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు సీఈసీ జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు.
మే 4న దేశవ్యాప్త ఉత్కంఠ.. అప్పుడే ఫలితాలు!
అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 4 (సోమవారం) నాడు జరుగుతుంది. మే 6వ తేదీ నాటికి ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి కావాలని ఈసీ గడువు విధించింది. ఈ షెడ్యూల్ విడుదలతో ఇప్పటికే రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి.