చైత్ర నవరాత్రుల ముగింపు సందర్భంగా జరుపుకునే శ్రీరామ నవమి పర్వదినం ఈ ఏడాది మార్చి 26, 27 తేదీల్లో వస్తోంది. పంచాంగం ప్రకారం, నవమి తిథి మార్చి 26, గురువారం ఉదయం 11:48 గంటలకు ప్రారంభమై, మార్చి 27, శుక్రవారం ఉదయం 10:06 గంటలకు ముగుస్తుంది. ఈ కారణంగా వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు రోజుల్లో సెలవులు ఉన్నాయి.
• మార్చి 26న సెలవు ఉన్న రాష్ట్రాలు: గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, ఉత్తరాఖండ్.
• మార్చి 27న సెలవు ఉన్న రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఒడిశా, సిక్కిం, బీహార్.
తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో మార్చి 27న బ్యాంకులు పనిచేయవు.