కేరళలో బయటపడ్డ మరో ప్రాణాంతక వ్యాధి.. తొమ్మిదేండ్ల బాలిక మృతి.. ఆ వ్యాధి లక్షణాలేంటీ?

Published : Aug 17, 2025, 02:35 PM IST

Amoebic Encephalitis Death:కేరళలోని కోజికోడ్ జిల్లాలో తొమ్మిదేళ్ల బాలిక అమీబిక్ ఎన్‌కెఫాలిటిస్ కారణంగా ప్రాణాలు కోల్పోయింది. ఇది కలుషిత నీటిలో ఉండే అమీబా వల్ల సంభవించే అరుదైన మెదడు ఇన్ఫెక్షన్. వైద్యులు దీన్ని "మెదడును తినే అమీబా" అని పిలుస్తారు. 

PREV
15
కేరళలో మరో ప్రాణాంతక వ్యాధి

కేరళలో మరో ప్రాణాంతక వ్యాధి బయటపడింది. ఇటీవల నిపా వైరస్ వ్యాప్తి తీవ్రతరం కావడంతో కలకలం రేగింది. పలువురు ఈ వ్యాధి బారిన పడ్డారు. ఆ వ్యాధి మిగిల్చిన ఆవేదన మరిచిపోకముందుకే మరో వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా ఓ బాలిక ప్రాణాలు కోల్పోయింది. తాజాగా కోజికోడ్ జిల్లాలో 9 ఏళ్ల బాలిక అమీబిక్ ఎన్సెఫాలిటిస్ ఇన్ఫెక్షన్ (Amoebic Encephalitis) కారణంగా మరణించింది. 

ఈ వ్యాధి కలుషితమైన నీటిలో ఉండే అమీబా వల్ల కలిగే అరుదైన మెదడు ఇన్ఫెక్షన్, దీనిని సాధారణంగా ‘మెదడును తినే అమీబా’గా కూడా పిలుస్తారు. ఈ ఘటన స్థానిక ప్రజల్లో భయం, ఆందోళన సృష్టించింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ వెంటనే అలర్ట్ జారీ చేసి, ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

25
అసలేం జరిగింది?

సీనియర్ ఆరోగ్య అధికారుల ప్రకారం... ఆగస్టు 13న జ్వరం, తలనొప్పి లక్షణాలతో బాలికను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో ఆగస్టు 14న ఆ బాలికను కోజికోడ్ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెను కాపాడలేక, అదే రోజు మృతి చెందింది. వైద్యపరీక్షలలో అమీబిక్ ఎన్‌కెఫాలిటిస్ కారణంగా మరణించిందని నిర్ధారించారు. దీనిని 'బ్రెయిన్ ఈటింగ్ అమీబా' అని కూడా పిలుస్తారు. ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత, అధికారులు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేరళలో ఇప్పటికే ఇటువంటి నాలుగు కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. కలుషితమైన నీటి వల్ల ఆ అమ్మాయికి ఇన్ఫెక్షన్ సోకిందని ఆరోగ్య నిపుణులు తెలిపారు.

35
అమీబిక్ ఎన్సెఫాలిటిస్ అంటే ?

వైద్య నిపుణుల ప్రకారం, అమీబిక్ ఎన్సెఫాలిటిస్ అనేది మెదడుకు వచ్చే అరుదైన, ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్. దీనిని ప్రధానంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు: ప్రాథమిక అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (PAM) ,గ్రాన్యులోమాటస్ అమీబిక్ ఎన్సెఫాలిటిస్ (GAE). 

ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (PAM) ప్రధాన కారణం నేగ్లేరియా ఫౌలేరి అనే అమీబా. ఈ అమీబా మెదడు కణజాలాన్ని నాశనం చేసి, తీవ్ర మెదడు వాపుకు దారితీస్తుంది. 

చాలా సందర్భాల్లో ఇది మరణానికి దారితీస్తుంది. ఇన్ఫెక్షన్ అరుదుగా కనిపించినప్పటికీ, సాధారణంగా ఆరోగ్యకరమైన పిల్లలు, కౌమార దశలోని యువకులు ఎక్కువగా బలహీనపడతారు. కలుషితమైన నీటిలో మునిగితే, ఈ ఇన్ఫెక్షన్ రావడంలో ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నది, చెరువు, కాలువలలో మునిగే వారు ప్రమాదంలో ఉంటారు.

45
లక్షణాలు

వైద్య నిపుణుల వివరాల ప్రకారం.. ప్రారంభంలో లక్షణాలు సాధారణ ఫ్లూ లాంటివే ఉంటాయి, వీటిలో తలనొప్పి, జ్వరం, వికారం, వాంతులు ఉంటాయి. అయితే, వ్యాధి తీవ్రమైన సందర్భాల్లో మెడ బిగుసుకుపోవడం, మూర్ఛలు, కోమా, అలాగే భ్రాంతులు, శరీర సమతుల్యత సమస్యలు వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఈ ఇన్ఫెక్షన్ లక్షణాలు వేగంగా అభివృద్ధి చెందుతూ 5–18 రోజుల్లో ప్రాణాంతకం కావచ్చు.

55
సూచనలు / నివారణ

వైద్య నిపుణులు, ఆరోగ్య శాఖలు ప్రజలను హెచ్చరిస్తూ, పిల్లలను చెరువులు లేదా నిలిచిన నీటిలో స్నానం చేయనివ్వకూడదని, స్విమ్మింగ్ పూల్స్, వాటర్ థీమ్ పార్క్‌ల నీటిని క్రమంగా క్లోరినేట్ చేయడం ముఖ్యం అని సూచించారు. కలుషిత నీటితో వచ్చే అవకాశాన్ని తగ్గించడం ద్వారా ఈ ప్రాణాంతక వ్యాధి నుండి రక్షణ పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories